గతవారం మొదలైన బిగ్ బాస్ తెలుగు షో వినూత్నంగా సాగుతోంది. ఇప్పటి వరకూ తెలుగువారు ఎవ్వరూ చూడని ఇలాంటి ఒక షో ని మా టీవీ చక్కగా నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఇరగ దీస్తూ ఉండగా తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్ లో ఈ షో లోని పార్టిసిపెంట్ ఆదర్శ్ మత్తు మందు తీసుకున్న వాడిలాగా రెచ్చిపోయాడు.


ఒక్కసారిగా అరుస్తూ గోల చేస్తూ అందరి మీదా పడ్డాడు అతగాడు. తనను అదుపు చేయాలని చూసిన మధుప్రియ, సమీర్ తదితరులపై పెద్దగా అరుస్తూ దాడికి దిగాడు. తనకు విస్కీ కావాలని కేకలు పెట్టాడు. ఈ క్రమంలో ధనరాజ్ అతని వద్దకు వెళ్లగా, చెయ్యిని రక్తం వచ్చేలా కొరికేశాడు. కాసేపటికి తనలో తానే ఏడ్చి ధనరాజ్ కి క్షమాపణలు చెప్పుకొచ్చాడు ఆదర్శ్.


ప్రిన్స్ అనే కుర్రాడితో కలిసి తన రూమ్ లోకి వెళ్ళిపోయిన ఆదర్శ్ అందరికీ ప్రాంక్ అనిపించేలా ప్రవర్తించాడు. వస్తువులని విసిరేష్ ప్రిన్స్ మీద తిరగ బడ్డాడు. ఇవాళ ఎపిసోడ్ కోసం ఎదురు చూసేలా చేసాడు ఆదర్శ్ మాత్రం .

మరింత సమాచారం తెలుసుకోండి: