టాలీవుడ్ చరిత్ర లోనే ఎప్పుడూ లేనంతగా మన హీరోల మీద, నటీ నటుల మీదా ఈ డ్రగ్ మాఫియా కేసు వచ్చి పడింది. కెల్విన్ అనే ఒక అతిపెద్ద డ్రగ్ కింగ్ పిన్ దొరకడం తో దాదాపు 12 మంది సినిమా పెద్దలకి సిట్ వారు నోటీసులు పంపించారు. వారిలో ముందుగా ఇవాళ పూరీ జగన్నాథ్ విచారణ కి హాజరు అయ్యారు. అయితే మిర్యాలగూడ పోలీసులు , ఎక్శైజ్ అధికారి సహా మరికొందరు ఈ విచారణ లో భాగం గా కనిపిస్తున్నారు.


ప్రస్తుతం సిట్ ఆఫీసు లో ఉన్న పూరీ జగన్నాథ్ ని పోలీసులు పలురకాల ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. పోలీసు డిపార్ట్మెంట్ చాలా తెలివిగా కెల్విన్ తో సంభాషణల మొదలు, డ్రగ్స్ వాడకంపై వీడియోల వరకూ సిట్ సేకరించింది. ఇక అత్యంత కీలకమైన ఓ ఫోటో పూరీ జగన్నాథ్ ను ఇబ్బందులు పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.


హీరో రవితేజ, అతని సోదరుడు, ఇటీవల మరణించిన భరత్ లకు పూరీ స్వయంగా డ్రగ్స్ అందిస్తున్న ఫోటో ఒకటి సిట్ వద్ద ఉంది. ఈ ఫోటోకు ఆయన సమాధానం చెప్పాల్సి వుంటుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సిట్ అధికారి ఒకరు తెలిపారు. మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఫోటో లో పూరీ స్వయంగా రవితేజ కి డ్రగ్స్ ఇస్తునట్టు ఉంది అనీ ఆ ఫోటో కెల్విన్ కెమెరా లో ఎవరో తీసారు అనీ తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: