డ్రగ్స్ కేసు టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతూ అందరిని దిమ్మతిరిగేలా ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి. రోజుకో ములపును చూస్తుంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలామందికే సంబంధాలు ఉన్నాయని అనుమానం రాకమానదు. ఇప్పటికే చాలా మంది సినీమా ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న సిట్ బృందానికి రోజుకో ఆధారాలు దొరుకుతున్నాయి.
ప్రస్తుతం 12 మందికి విచారించాలని భావించిన సిట్ బృందం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను సిట్ అధికారులు ఈ రోజు విచారించారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, ఓ ఈ వెంట్ సందర్భంగా పబ్లో రెండు మూడు సార్లు కెల్విన్ను కలిశానని, అంతకు మించి అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడిని తర్వాత ఎప్పుడూ కలవలేదని విచారణలో పూరీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సోషల్మీడియాలో ఓ ఫొటో బయటకు వచ్చింది. ఛార్మీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో పూరీతోపాటు కెల్విన్ కూడా ఉన్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఆ కార్యక్రమంలోనే ఛార్మీ పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఛార్మీకి శుభాకాంక్షలు చెప్పేందుకు కెల్విన్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఫొటో డ్రగ్స్ కేసులో పూరీని ప్రశ్నించేందుకోసం సేకరించిన సిట్ అధికారుల నుంచి వచ్చిందా? లేక సినీ పరిశ్రమ నుంచి వచ్చిందా? అనే విషయం తెలియకపోయినా సోషల్మీడియాలో మాత్రం పూరీని ప్రశ్నిస్తోంది. మరి ఈ ఫొటో చూసి పూరీ, త్వరలో విచారణకు హాజరు కాబోయే ఛార్మీ ఏం సమాధానం చెబుతారోనని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఈ ఫోటోతో చాలా మందిని విస్తుపోయేలా చేస్తోంది.