గత కొంత కాలంగా టాలీవుడ్ లో సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయన్న వార్త పెను సంచలనాలకు నాంది పలికింది.  ఈ మేరకు ఇండస్ట్రీలో కొంత మందికి సిట్ నోటీసులు కూడా పంపించింది.   ఇక టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్‌కు డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధం ఉందని వార్తలు రావడం సంచలనంగా మారింది.  నిన్న ఆయన ‘సిట్‌’ ముందు హాజరై వారి ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో తన ఆవేదనను పంచుకున్నారు. ఎప్పుడు డేరింగ్ గా కనిపించే పూరి ఎమోషనల్ కావటంతో అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
Image result for loafer movie stills
పలువురు సినీ ప్రముఖుల సైతం పూరికి మద్దతిస్తున్నారు.  పూరి తన సినిమాల్లో ఇప్పటి వరకు పోలీసులను ఎంతో గొప్పగా చూపించాడని..పోకిరి సినిమాలో చూపించాడు.  అంతే కాదు పూరి ఇప్పటి వరకు చాలా సినిమాల్లో డ్రగ్స్ దందాలపైనే ఎక్కువ సినిమాలు తీశారు..మొత్తానికి వాటికి ఎలా చెక్ పెట్టాలో కూడా చూపించేవాడు.  అలాంటిది ఆయనే డ్రగ్స్ సంబంధిత కేసులో ఇరుక్కోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.  
Image result for puri jagannadh sad
ప్రస్తుతం ఫిదా మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ కూడా పూరీకి మద్దుతుగా నిలిచాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమాలో నటించిన వరుణ్, ఆయన చాలా మంచివాడన్నాడు. తన ఆరోగ్యం మాత్రమే కాదు ఇతరుల ఆరోగ్యం గురించి కూడా పూరీ శ్రద్ద తీసుకుంటాడని అలాంటి వ్యక్తిపై డ్రగ్స్ వినియోగిస్తున్నాడన్న ఆరోపణలు రావటం తనను షాక్ కు గురిచేసిందన్నాడు.
Image result for puri varun tej
అంతే కాదు గతంలో తనతో లోఫర్ చిత్రం చేసే సమయంలో పూరి ఎప్పుడూ డ్రగ్స్ తీసుకున్నట్లు కనీసం ఆ మాటలు కూడా తన వద్దకు రాలేదని అన్నారు. మంచి మార్గంలో సంతోషంగా ఉండటం ఎలాగో పూరికి తెలుసునన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: