స్టార్స్ లేకుండా సినిమా ఆడాలంటే ఒకటి కరెక్ట్ కంటెంట్ అయినా ఉండాలి లేదా కంటెంట్ పాతదే అయినా చెప్పే కథనంలో అయినా క్రేజీ థింగ్స్ ఉండాలి. అందుకే సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నంలో యావరేజ్ హీరోలంతా స్టార్స్ ను టార్గెట్ చేస్తుంటారు. వారి పేరో.. వారి పాటో ఏదో ఒకటి వాడేస్తూ సినిమాకు వారి ఫ్యాన్స్ వచ్చేలా చేసుకుంటారు.


ఇక ఈ రచ్చ సంపత్ నందికి బాగా అలవాటు. రాం చరణ్ తో రచ్చ తీసిన సంపత్ నంది సర్దార్ గబ్బర్ సింగ్ కు మొదట డైరక్షన్ ఛాన్స్ వచ్చినా ఎందుకో బయటకు వచ్చాడు. ఇక ఆ తర్వాత రవితేజతో బెంగాల్ టైగర్ సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు. ప్రస్తుతం గౌతం నంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సంపత్ నంది.


గోపిచంద్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో కేథరిన్ త్రెసా, హాన్సిక హీరోయిన్స్ గా నటించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమా టైటిల్ గా గౌతం నంద అని పెట్టి అత్తారింటికి దారేది సినిమాలో పవన్ క్రేజ్ వాడాలనుకోగా ఇప్పుడు అతని ఇంటిపేరు ఘట్టమనేని అని పెట్టి మహేష్ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు సంపత్ నంది.


ఇది యాదృచ్చికంగా జరిగిందా అనుకున్నదే అయినా ఘట్టమనేని అనగానే మహేష్ ఫ్యాన్స్ కు పూనకాలు రావడం కామన్. అందుకే మహేష్ ఫ్యాన్స్ కూడా గౌతం నంద సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నారు. సో అలా అందరు తల ఓ చెయ్యేస్తే హిట్ కోసం తపిస్తున్న గోపిచంద్ మళ్లీ ట్రాక్ ఎక్కేసినట్టే. ఈ సినిమా ఆడియోలో కచ్చితంగా హిట్ కొడతాం అని చెప్పిన గోపిచంద్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగానే సంపత్ నంది గోపికి హిట్ ఇస్తాడనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: