ఉడ్తా-హైదరాబాద్ గా మీడియాలో పేరు పెట్టించుకుని టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి వార్తలు లేకుండా మీడియాకు ఒక్కరోజు కూడ గడవడం లేదు. కేవలం మీడియా సంస్థలకే కాదు సామాన్యుల మధ్య జరిగే మాటల చర్చలలో కూడ ఈ వ్యవహారమే తరుచూ వినిపిస్తూ ఉండటంతో తెలుగు ప్రజలను ఈ కేసు ఏవిధంగా ప్రభావితం చేస్తోందో అర్ధం అవుతుంది. 

ఇది ఇలా ఉండగా కొందరు జ్యోతిష్కులు ఈ వ్యవహారంలో చిక్కుకున్న సెలెబ్రెటీల జాతకాలను విశ్లేషిస్తూ వారు కూడ మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. సెలెబ్రెటీల జాతకాల పై తరుచు విశ్లేషణలు ఇచ్చే వేణు స్వామి ఈ వ్యవహారంలో చిక్కుకున్న పూరి ఛార్మీల జాతకాల పై విశ్లేషణలు చేసి అనేక ఆ సక్తికర విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. 
 
ఈ జ్యోతిష్కుడు చెపుతున్న అంచనాల ప్రకారం పూరి జీవితాన్ని ఈ కేసు ఒక కుదుపు కుదుపు కుదుపుతుందని ఈ కేసువల్ల పూరి జీవితంలో ఏర్పడ్డ మచ్చ అంత సులువుగా మాసిపోదని దీనికి కారణం పూరి జాతకంలోని లోపాలే కారణం అంటూ వేణు స్వామి అభిప్రాయ పడుతున్నాడు. అదేవిధంగా చార్మి జాతకంలో ఏలినాటి శని నడుస్తోందని అందువల్ల ఆమెకు సమస్యలు తప్పకపోవచ్చని వేణు స్వామి చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే సెప్టెంబర్ 9 తరువాత పూరి చార్మీలు ఈ కేసు నుండి బయట పడతారని వేణు స్వామి చెపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు పై తీవ్ర ఆరోపణలు వస్తాయని తాను విశ్లేషణలు చేసిన విషయాన్ని వేణు స్వామి గుర్తుకు చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన విచారణలో పూరి జగన్నాథ్ కొంతమంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయట పెట్టినట్లు ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనాలు ప్రసారం చేస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు బయటకు రావడంతో టాలీవుడ్ ప్రముఖులు అంతా ఏ క్షణాన్న ఏ పేరు బయట పడుతుందో అన్న టెన్షన్ లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: