ఖైది నంబర్ 150 తర్వాత వినాయక్ తో స్టార్స్ సినిమా తీస్తారని అనుకున్నారు కాని ప్రస్తుతం స్టార్ హీరోలెవరు ఖాళీగా లేకపోవడంతో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో వినాయక్ సినిమా చేస్తున్నాడు. ఆకుల శివ అందించిన ఈ కథ టైటిల్ గా దుర్గ అని పెట్టారని సోషల్ మీడియాలో హడావిడి చేశారు. కాని ఈ విషయంపై దర్శకుడు వినాయక్ క్లారిటీ ఇచ్చారు.


వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదని అయితే ప్రచారంలో ఉన్న దుర్గ టైటిల్ మాత్రం పెట్టే అవకాశం లేదని అన్నారు. వినాయక్ ఈ విషయంపై ఇంతలా రెస్పాండ్ అవడానికి కారణం రవితేజతో కృష్ణ, సాయి ధరం తేజ్ తో దుర్గ అంటూ సోషల్ మీడియాలో బాగా హడావిడి చేశారు. అందుకే ఒకవేళ సినిమా టైటిల్ గా అది అనుకున్నా ఇప్పుడు మార్చేద్దామని చూస్తున్నారట.


వినాయక్ సినిమా అంటే మాస్ అండ్ కమర్షియల్ అంశాలకు కొదవలేదు. ఆ క్రమంలో సాయి ధరం తేజ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు కెరియర్ లో చేసిన సినిమాలన్ని కొత్త వాళ్లతోనే కాబట్టి ఈసారి తేజ్ కొడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాలనే ఉద్దేశంతో వినాయక్ తో సినిమా చేస్తున్నాడు.


కథ ఆల్రెడీ ఫైనల్ కాగా ప్రస్తుతం తేజ్ చేస్తున్న జవాన్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. మెగా హీరోలకు వినాయక్ బాగా కలిసి వచ్చే డైరక్టర్. అంతేకాదు వినాయక్ డైరక్షన్ మీద ఎంతో నమ్మకం కూడా. అందుకే అఖిల్ పోయినా సరే మెగాస్టార్ పిలిచి మరి ఖైది నంబర్ 150 అవకాశం ఇచ్చాడు.


అయితే ఖైది సినిమా హిట్ అందుకున్నా స్టార్స్ మాత్రం వినాయక్ కు డేట్స్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారు. మరి అలా ఎందుకు అన్నది మాత్రం అర్ధం కావట్లేదు. అందుకే తేజ్ తో సినిమా తీసి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు వినాయక్. మరి వినాయక్ తో తేజ్ కొట్టే హిట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: