డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఒక్కొక్కరూ సిట్ కార్యాలయానికి హాజరవుతూ వస్తున్నారు. మొన్న పూరి జగన్నాథ్, నిన్న శ్యామ్ కె.నాయుడు ఈ రోజు సుబ్బరాజు ఇలా వరుసగా డ్రగ్స్ కేసులో సిట్ హాజరు కావడంతో సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.  తాజాగా హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌ విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ఎదుట టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు శుక్రవారం ఉదయం హాజరయ్యాడు. ఆయన వద్ద సిట్ అధికారుల బృందం మత్తు దందాపై పూర్తి స్థాయిలో విచారణ జరుపనుంది.
Image result
అంతే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మరో పది మందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే 12 మందికి నోటీసులిచ్చి విచారణ జరుపుతున్న సిట్ బృందం పూరీ జగన్నాథ్ నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా తాజాగా నోటీసుల జారీకి సిద్ధమయ్యారట.  అయితే సుబ్బరాజు మొదటి నుంచి తనకు సిట్ నోటీసులు అందాయని, కానీ తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు.

నేడు సిట్ విచారణలో కూడా ఇదే విషయాన్ని వివరించనున్నట్లు తెలిసింది. కాగా సుబ్బరాజు ఇంటి వద్ద కాస్త గందరగోళం జరిగింది..కవరేజీ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిని సుబ్బరాజు ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీకి, మీడియాకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సుబ్బరాజు తన వాహనంలో ఎక్సైజ్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: