టాలీవుడ్ లో వరస హిట్ లు కొడుతున్న హీరో అల్లు అర్జున్ ఇప్పుడు అనుకోని ఒక వివాదం లో ఇరుకున్నాడు. ఆమధ్య చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగ్రహానికి గురైన మనోడిని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇప్పటికీ దెప్పి పొడుస్తూ, రివెంజ్ తీర్చుకుంటూ నే ఉన్నారు. తాజాగా ప్రో కబడ్డీ లీగ్ లో ఒక జట్టుని సొంతం చేసుకున్నాడు అల్లూ అర్జున్. రామ్ చరణ్ తో కలిసి తమిళ తలైవర్స్ అనే టీం ని బన్నీ కొన్నాడు. అల్లు అర్జున్, రామ్‌ చరణ్ తేజ్ తమ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా కమల్ హాసన్‌ ను నియమించారు.


ఈ నేపథ్యంలో జట్టు ప్రమోషన్ కోసం ఈ ముగ్గురూ కలిసి చెన్నైలో జట్టు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అదే వేదిక మీద కమల్ హాసన్ , రామ్ చరణ్ మామూలుగా కూర్చుని ఉండగా అల్లు అర్జున్ మాత్రం కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఇది తమిళ ఫాన్స్ ఆగ్రహానికి గురైంది. కమల్ హాసన్ లాంటి ఒక దిగ్గజ నటుడి ముందర అల్లూ అర్జున్ కుప్పిగంతులు వెయ్యడం ఏంటి అంటూ వాళ్ళు సీరియస్ అవుతున్నారు.


లెజెండరీ నటుడే ఒద్దికగా కూర్చుంటే...అల్లు అర్జున్ అలా కూర్చోవడమేంటి? సీనియర్లకు గౌరవం ఇవ్వడం కూడా తెలియదా? అని సోషల్ మీడియా సాక్షిగా రచ్చ రచ్చ చేస్తున్నారు. అల్లూ అర్జున్ వ్యక్తిత్వం కేవలం ఆ కాలుమీద కాలు వేసుకోవడమ లోనే ఎంత చీప్ అనేది తెలుస్తోంది అని వారు వాపోతున్నారు. అసలే తమిళులకు భాషా, ప్రాంతీయాభిమానం చాలా ఎక్కువ....మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. " ఒళ్ళు పొగరు తగ్గించుకో .. , నువేమన్నా పుడింగి గడివా " ఈ రకమైన ట్వీట్ లు అల్లూ అర్జున్ ని డైరెక్ట్ గా టాగ్ చేసి మరీ వేస్తున్నారు తమిళ జనాలు 

మరింత సమాచారం తెలుసుకోండి: