టాలీవుడ్‌ సీనియర్ డైరెక్టర్స్ లో కృష్ణవంశీ క్రియేటివిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అనుకున్న కథను  సన్నివేశాలను చాలా  పక్కాగా తెరకెక్కించడం కోసం ఈయన ఎంత కష్టపడతాడో అతడి దగ్గర నటించే నటీనటులకు కూడ నటన విషయంలో అంత టార్చర్ పెడతాడు.  దీనితో కృష్ణవంశీతో పనిచేసిన కొందరు నటీనటులు మళ్ళీ ఆయనతో నటించడానికి వెనకడు వేస్తారు.  

ఈ నేపధ్యంలో ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ తన సినిమాల గురించి తన వద్ద నటించే నటీనటుల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తన గురించి చెడుగా చెప్పేవాళ్ల కంటే మంచి చెప్పే వాళ్లే ఎక్కువ అని అంటూ తన గురించి చెడుగా చెప్పే వాళ్లలో ఒక హీరో గురించి తెలుసు అని అతనికి జ్ఞాపకశక్తి తక్కువని అందువల్ల రెండు డైలాగుల కంటే ఎక్కువ చెప్పలేడని కృష్ణవంశీ తెలిపాడు. 

అయితే ఆ హీరో పేరును ప్రస్తావించడానికినిరాకరిస్తూ ఆ హీరో చాలా హిట్ సినిమాలలో నటించిన హీరో అంటూ చిన్న లీకులు ఇచ్చాడు. అంతేకాదు ఆ హీరో సరిగ్గా పాత్రను అర్థం చేసుకోలేడని అలా కాదు ఇలా చెయ్యి అంటే  తన పై ద్వేషం పెంచుకున్న నేపధ్యాన్ని వివరించాడు. బాగా నటించడం వల్ల తనకు ఏదో మేలు జరిగుతుంది అన్న ఊహలలో చాలా మంది నటులు ఉంటారు అని అంటూ బాగా నటించమని చెపితే చాలా మంది అలుగుతారు అంటూ కొందరు నటులను టార్గెట్ చేస్తూ కృష్ణ వంశీ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇక తన ‘నక్షత్రం’ సినిమా ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి అని అంటూ నోట్ల రద్దు కూడా తన ‘నక్షత్రం’ పై ప్రభావం చూపింది అని కామెంట్స్ చేసాడు.  ఇక తానూ  మెగా అభిమానుల అంచనాల మేరకు ‘గోవిందుడు అందరివాడే’ చిత్రాన్ని తీయలేకపోయాను అని అంటూ మెగా హీరో రామ్ చరణ్‌కు నిరాశ కలిగించినందుకు తనకు ఎప్పుడు భాధగా ఉంటుంది అంటూ తన భాదను వ్యక్త పరిచాడు.

అయితే చరణ్ కెరియర్ లో గుర్తుండి పోయే సినిమాను తానూ ఎప్పడికైనా చేస్తాను అని చెపుతూ తిరిగి చరణ్ తో మరో సినిమా చేయాలి అన్న కోరికను బయట పెట్టాడు. ఫెయిల్యూర్ దర్శకులను తన దరికి కూడ రానివ్వని చరణ్ కృష్ణ వంశీకి మరో అవకాశం ఇస్తాడా అన్నదే ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: