తెలుగు బుల్లితెరపై మొట్ట మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ షో ‘బిగ్ బాస్’. గత ఐదు రోజుల నుంచి బిగ్ బాస్ షో బుల్లితెరపై హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో మొదట సంపూర్ణేష్ బాబు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు..కానీ ఆయన టీమ్ ని సరిగా లీడ్ చేయలేకపోవడంతో ఆ బాధ్యతల నుంచి బిగ్ బాస్ తొలగించారు.
ఇక అందరితో కలుపుగోలుగా ఉంటున్న సమీర్ కి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. కానీ సమీర్ ఆ టాస్క్ ని సరిగా నిర్వహించకపోవడంతో అతని ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించారు. హరి తేజ, ప్రిన్స్ మద్య గొడవ తర్వాత సారీ చెప్పుకోవడం.. ఇలా రోజు రోజు ఒక్కోరకమైన ట్విస్ట్ లు జరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ లోకి ఎంతో ఉత్సాహంగా ఎంట్రీ ఇచ్చిన సింగర్ మధుప్రియ మొదటి రోజు నుంచి కాస్త డల్ గా కనిపిస్తూ వచ్చింది.
అంతే కాదు ఆమె ఆరోగ్యం కూడా సరిగా సహకరించడం లేదని సహ సభ్యులు అంటున్నారు. ఆ మద్య అర్చన తనపై కోపగించుకుందని కన్నీరు పెట్టింది మధుప్రియ. అంతే కాదు తన సహ సభ్యురాలు కత్తి కార్తీకతో అసలు ఈ షో లో తాను ఇమడలేక పోతున్నానని..తనకు తనవాళ్లు గుర్తుకు వస్తున్నారని..ఎంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోతే అంత బాగున్నూ..అని తెగ బాధపడి కన్నీరు కూడా పెట్టుకుంది.
ఇది గమనించి ప్రస్తుత బిగ్ బాస్ కెప్టెన్ కల్పన నిన్న రాత్రి మధు ప్రియను దగ్గరకు తీసుకొని ధైర్యాన్ని చెప్పింది. బిగ్ బాస్ లో సభ్యులు 70 రోజులు ఉండాల్సి వస్తుంది. మరి బిగ్ బాస్ లో వచ్చే టాస్క్ లు దాటుకొని చివరి వరకు ఎవరు ఉంటారో అని ప్రేక్షకుల ఇప్పటి నుంచి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరోవైపు ఈ షోపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి.