బాలకృష్ణ 102వ సినిమాకోసం చాలా మంది కథలు సిద్ధం చేశారు. అయితే కె.ఎస్.రవికుమార్ చెప్పిన కథ బాలయ్యకు విపరీతంగా నచ్చేసింది. రాయలసీమ నేపథ్యంలో సినిమా నేపథ్యం ఉంటుందని టాక్. పవర్ ఫుల్ క్యారక్టర్ తో ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు నటరత్న. దీనికి రెడ్డిగారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి 101వ సినిమాగానే ఇది తెరకెక్కాల్సి ఉంది. అయితే పూరీ జగన్నాథ్ పైసా వసూల్ కథ వినిపించడంతో బాలయ్య దాన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు. పైగా పూరీ చాలా వేగంగా సినిమాలు తీస్తాడు. దీంతో.. వెంటనే రంగంలోకి దిగిపోయారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
పూరీ జగన్నాథ్ పైసా వసూల్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఇది పూర్తి కానుంది. వీలైతే ఈ సినిమాను అనుకున్న తేదీకంటే ముందుగానే రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటుండడంతో నిర్మాతలు దీన్ని త్వరగా పూర్తి చేయాలని కోరినట్టు సమాచారం.
బాలయ్య 102వ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించనుంది. సి.కల్యాణ్ నిర్మాత. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ రూపుదిద్దకుంటోంది. సుమారు 30 రోజులకు పైగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. సాంకేతికంగా కూడా హై స్టాండర్డ్స్ తో ఈ సినిమాను తీర్చిదిద్దనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.