ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు మా టీవీ లో సూపర్ హిట్ షో గా నడుస్తోంది. వారాంతం లో ఎన్టీఆర్ హోస్ట్ గా రావడం సభ్యులు అందరితో మాట్లాడడం చూసాం మనం. ఈ షో లో ఎప్పుడూ ఏడుస్తూ కనిపించే మధు ప్రియ ని బయటకి పంపించెయ్యమని నెటిజన్ ల నుంచి తీవ్ర ప్రెజర్ అందుతోంది. నిన్న షో లో మధు ప్రియ , కత్తి కార్తిక సేఫ్ అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ .


కత్తి మహేష్ ని దాదాపు బయటకి పంపించిన ఎన్టీఆర్ ఆఖర్లో ఒక్కనిమిషం ఉండండి అంటూ ఆయన్ని ఆపేసి .. హరితేజ - జ్యోతి లు కూడా బట్టలు సర్దుకోవాలి అని ఆదేశించారు. ఈ లోగా ఇవాళ ఉదయం  స్టార్ మా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో బిగ్‌బాస్‌కు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మ‌ధుప్రియ ఏడుస్తూ క‌నిపించింది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.


అంత‌గా ఏడ్చే మ‌ధుప్రియ ఈ షోకు ఎందుకు రావాలి? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మధు ప్రియను షో నుంచి బ‌య‌ట‌కు పంపేయడం మంచిదని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఆమె సేఫ్ జోన్ లో పడిపోయింది కూడా. సో హరితేజ - జ్యోతి - మహేష్ లలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జ్యోతి ని ఇవాళ షో నుంచి ఎలిమినేట్ చెయ్యబోతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: