తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో మంచి విజయం సాధించిన శేఖర్ కమ్ముల తర్వాత ‘ఆనంద్’ మంచి కాఫీలాంటి సినిమా అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  ఆ తర్వాత సుమంత్ తో ‘గోదావరి’ చిత్రంతో మరో మంచి విజయం సాధించాడు. శేఖర్ కమ్ముల  అద్భుతమైన లవ్ స్టోరీస్ తో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు.  తాజాగా మెగా అబ్బాయి వరుణ్ తేజ్ తో ‘ఫిదా’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం హీరోగా మంచి ఇమేజ్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ కి గోల్డెన్ చాన్స్ అనే చెప్పాలి..ఎందుకంటే రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది.  
Image result for fidaa movie stills
ఈ చిత్రంలో హీరోయిన్ నటించిన సాయి పల్లవి తెలంగాణ యాస మాట్లాడుతూ అందరి మనసు దోచింది.  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లతో దూసుకు పోతున్న ఈ చిత్రాన్ని తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ తిలకించారు.  నిత్యం అధికారులతో సమీక్షలు,ప్రజా సంక్షేమంపై దృష్టిని సారించే ముఖ్యమంత్రి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'ఫిదా' సినిమా చూసి ఫిదా అయిపోయారు.
Image result for fidaa movie stills
 తెలంగాణ సీఎం గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో సంక్షేక కార్యక్రమాలు అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఈ పని వత్తడిలో కాస్త సినిమాలకు దూరంగానే ఉంటున్నారు..అయితే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ మంచి టాక్ రావడంతో ఆయన ఈ సినిమాను ప్రత్యేకంగా తిలకించారు. ఈ విషయాన్ని వంశీ కాక, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతే కాదు సినిమా చాలా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ ని అభినందించారని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: