‘బాహుబలి 2’ ఘనవిజయం తరువాత ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిన నేపధ్యంలో ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగి పోయింది. ఈ నేపధ్యంలో ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ కు సంబంధించిన వార్తలు కూడ హాట్ న్యూస్ గా మారుతున్నాయి.

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ తెలుగు తమిళ హిందీ భాషలలో ఒకేసారి నటిస్తున్న ‘సాహో’ సినిమాకు 150 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెడుతూ ఉండటమే కాకుండా ఈసినిమాకు ప్రముఖ బాలీవుడ్ నటులతో పాటు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈసినిమాకు పనిచేస్తున్నారు. అయితే ఈసినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడటంతో ఈమూవీలో కూడ అనుష్కను హీరోయిన్ గా రిపీట్ చేస్తారు అని అనుకున్నారు అంతా.

అయితే ఆ తరువాత ఈసినిమాకు సంబంధించి హీరోయిన్ గా మళ్ళీ అనుష్కను రిపీట్ చేయకుండా వేరే కొత్త అమ్మాయిని కాని లేదంటే ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ ను కాని ఎంపిక చేయాలి అని ఈసినిమా యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక వ్రాసిన కథనం ప్రకారం అనుష్క ‘సాహో’ లో నటించను అని ప్రభాస్ కు తన తిరస్కరణను సున్నితంగా తెలియచేసినట్లు ఆ జాతీయ మీడియా పత్రిక ఆసక్తికర కథనం వ్రాసింది. 

అంతేకాదు అనుష్కను ‘సాహో’ మేకర్స్ పక్కన పెట్టలేదని పలు కారణాలతో అనుష్కనే ఈ సినిమా చేయడానికి నో చెప్పిందని ఆ పత్రిక కథనం. ‘సాహో’ సినిమాలో నటించడానికి తనకు రెండు నెలల సమయం కావాలని అప్పటి వరకు తాను డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని అనుష్క ప్రభాస్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ‘సాహో’ మేకర్స్ తనను సంప్రదించడానికి ముందే అనుష్క కొన్ని తమిళ ప్రాజెక్టులకు కమిటైందట. 

దీనితో ముందు వారికి కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి వాటికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పిందట. ఇదే పత్రిక కథనం ప్రకారం బాలీవుడ్ నటుడు చుంకీ పాండే సాహో సినిమాలో కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. చుంకీ పాడేకు సాహో స్క్రిప్టు చాలా నచ్చిందని, అందులో తన పాత్ర కీలకంగా ఉండటంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్‌ను రప్పిస్తున్నారు అని తెలుస్తోంది. స్టార్ వార్స్ సినిమా స్థాయిలో టెక్నికల్ గా ‘సాహో’ ను తీర్చిదిద్దాలని సుజిత్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: