ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. తారక్ ఎంట్రీతో సరికొత్త ఉత్సాహాలతో సాగుతుండగా బిగ్ బాస్ 14 మంది కంటెస్టంట్స్ లో మొదట ఎలిమినేటర్ జ్యోతి బయటకు వచ్చింది. ఈ క్రమంలో జ్యోతి తారక్ మధ్య జరిగిన సంభాషణలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో జ్యోతి మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లో చేరుతుందని తెలుస్తుంది.


బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన జ్యోతిని సాగనంపే క్రమంలో జ్యోతికి తారక్ ఓ హింట్ ఇచ్చాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు అలర్ట్ గా ఉండడని అన్నాడు. అంటే బిగ్ బాస్ నుండి మళ్లీ జ్యోతికి కాల్ వచ్చే అవకాశం ఉందేమో అని డౌట్ పడుతున్నారు.


ఇక హౌజ్ లో తన మీద అభియోగాలు చేసిన వారిని చూపిస్తూ వాటికి వివరణ అడుగుతూ తారక్ చేసిన ఆదివారం ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇక మొదటి ఎలిమినేటర్ అవడంతో హౌజ్ మెట్స్ మధ్య మంచి అండర్ స్టాడింగ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రోగ్రాం ఎలా ఉండబోతుందో వారికి కూడా ఇప్పుడిప్పుడే అవగాహన రావడంతో నెరసంగా ఉన్న వారు కూడా షో మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. 


ఇక బిగ్ బాస్ చెప్పింది చెప్పినట్టు చేయడంతో పాటుగా సాటి హౌజ్ మెట్స్ తో మంచి నడవడికతో ఉంటేనే తమని హౌజ్ లో ఉండనిస్తారని జ్యోతి ఎలిమినేషన్ తో తెలిసింది. అయినా సరే మళ్లీ జ్యోతికి బిగ్ బాస్ హౌజ్ లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో విచారణకు పాల్గొనాల్సి ఉన్న ముమైత్ ఖాన్ కూడా బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు రావాల్సిందే. మరి ఈ పరిస్థితుల్లో రియాలిటీ షో ఎలాంటి కొత్త మలుపు తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: