నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘పైసా వసూల్’ వార్తలు తిరిగి హడావిడి చేయడం మొదలుపెట్టాయి. గత కొన్నిరోజులుగా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న పూరి ఆ విషయాలను పక్కకు పెట్టి తిరిగి బాలయ్య సినిమా పై మనసుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన రెండు ఫస్ట్ లుక్ ఫోటోలను బాలకృష్ణ పుట్టినరోజునాడు విడుదల చేసినా ఆ తరువాత ఈసినిమాకు సంబంధించిన హంగామా ఏమాత్రం కనిపించలేదు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాను ముందు అనుకున్నట్లు సెప్టెంబరు 29న కాకుండా ఇంకా ముందుగానే సినిమాను రిలీజ్ చేసేయాలన్న ప్రణాళికల్లో పూరి ఉన్నట్లు టాక్.

దీనితో ఈసినిమాను ప్రమోట్ చేసే పనిలో ఈసినిమా యూనిట్ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నిన్నరాత్రి నుంచి ఈసినిమా యూనిట్ ట్విట్టర్లో ‘ఎన్బీకే 101 ఫీవర్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో బాలయ్య 1974లో సినీ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆయన ప్రస్థానాన్ని సంక్షిప్తంగా చూపించారు. చివరగా ‘పైసా వసూల్’ దగ్గర ఈవీడియోను ముగించారు.

అంతేకాదు ఈనెల 28న ‘స్టంపర్ 101’ రిలీజవుతుందంటూ ప్రకటించి నందమూరి అభిమానులకు కొంత గందరగోళాన్ని సృష్టించారు. కొద్దిసేపు ఈస్టంపర్ ఏంటన్నది అభిమానులకు అర్థంకాలేదు. అయితే ఈమూవీ టీజర్‌ కే ఇలా కొత్త పేర పెట్టి లాంచ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఆగస్టు 15 కల్లా ఈమూవీ ఫస్ట్ కాపీ రెడీ చేయాలన్న ప్రణాళికతో పూరి తన టెన్సన్స్ ను పక్కకు పెట్టి పరుగులుతీస్తున్నట్లు టాక్.

అయితే అనూహ్యంగా ఈమూవీ బడ్జెట్ 46 కోట్లు దాటేసింది అన్న వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో పాటు జనాలు కోరుకుంటున్న భారీతనం విదేశాల్లో ఎక్కువ కాలం షూట్ చేయడం వల్ల ఈమూవీ బడ్జెట్ పెరిగిపోయింది అని అంటున్నారు. అయితే ఈసినిమాకు సంబంధించి ఒక పవర్ ఫుల్ టీజర్ ను ఈనెల 28న ఉదయం 10.10 కి విడుదల చేసి ఆ తరువాత ఆగష్టు 15న ఈసినిమా ఆడియో ఫంక్షన్ నిర్వహించి ఈమూవీకి భారీ బిజినెస్ తో పాటు క్రేజ్ ను కూడ తీసుకురావాలని వ్యతిరేక పరిస్థుతులలో ఎదురీదుతూ పూరిజగన్నాథ్ చేస్తున్న కసరత్తులు హాట్ న్యూస్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: