డ్రగ్స్ కేసు నెమ్మదిగా ఏడవ రోజుకి చేరుకుంది. ఇవాళ విచారణ లో భాగంగా ఐటెం గర్ల్ , నటి ముమైత్ ఖాన్ ని సిట్ ప్రశ్నిస్తోంది. ఉదయం పది గంటల టైం లో ఆమె సిట్ కార్యాలయానికి చేరుకుంది. గంట నుంచీ ఈ విచారణ జరుగుతూ ఉండగా ఆమెని అనేక ప్రశ్నలతో సిట్ ఉక్కిరి బిక్కిరి చేస్తునట్టు తెలుస్తోంది. పూరీ తో హీరోయిన్ ఛార్మీ తో ఎక్కువగా ఎప్పుడూ పార్టీలలో కనిపించే ముమైత్ ఖాన్ ని అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు సిట్ వారు.


చార్మీ తో పూరీ తో పార్టీలకి వెళ్ళినప్పుడు ముగ్గురూ కలిసి డ్రగ్స్ తీసుకున్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించింది సిట్. కెల్విన్ కీ ముమైత్ కీ మధ్యన పెద్దగా డైరెక్ట్ సంబంధాలు ఉన్నట్టు సిట్ దగ్గర ఆధారాలు లేకపోయినా ముమైత్ - చార్మీ - పూరీల మధ్యన డ్రగ్స్ కి సంబంధించి ఏదో నడిచినట్టి సమాచారం ఉందట .


దాన్ని బేస్ చేసుకుని సిట్ ప్రశ్నలు అడుగుతోంది అంటున్నారు. ముమైత్ కూడా డ్రగ్స్ వాడిందన్న అనుమానాలతో ఆమెను విచారణకు పిలవగా, నిన్న చార్మీని విచారించిన మహిళా అధికారులే నేడు ముమైత్ నూ విచారిస్తున్నారు.  కెల్విన్ గురించి ముమైత్ కి ఎంత వరకూ తెలుసు అని అడిగిన మహిళా అధికారులు పూరీ - కెల్విన్ ల మధ్య ఎలాంటి ఫ్రెండ్ షిప్ ఉండేది అని అడుగుతున్నారు. మీతో పాటు చార్మీకి కూడా పూరీ జగన్నాథ్ నుంచి డ్రగ్స్ అందాయా? కాల్విన్ పార్టీలకు మీరు, పూరి కలసి వెళ్లేవారా? పార్టీలు ఎక్కడ జరుగుతుంటాయి?  ఇలాంటి ప్రశ్నలు అక్కడ ఉత్పన్నం అయ్యాయట 

మరింత సమాచారం తెలుసుకోండి: