హీరో రాజశేఖర్ ప్రస్తుతం గరుడ వేగ అనే సినిమాలో బిజీ గా ఉన్నారు. మొన్న మొన్నటి వరకూ ఆయన కెరీర్ దాదాపు చరమాంకం లో ఉంది అనే అనుకున్నారు చాలామంది. సొంతగా నిర్మాతగా మారి గడ్డం గ్యాంగ్ సినిమా తీసి తీవ్రంగా అప్పుల్లో కూరుకుని పోయారు ఆయన ఆ తరవాత కాలం లో సినిమాలు చెయ్యడానికి ఆఫర్ లు కూడా రాని పరిస్థితి. సో నెమ్మదిగా ఆయన సినిమాల్లోంచి తప్పుకుని తన కూతురు శివానీ ని హీరోయిన్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు.


ఫిలిం నగర్ లో ఇప్పుడు అందరూ శివానీ తాజా ఫోటో షూట్ గురించే మాట్లాడుతున్నారు . హీరోయిన్ గా త్వరలో వెండితెర మీద కనిపించ బోతున్న ఆమె కి మొదటి సినిమాలో హీరోగా ఎవరు కనిపిస్తారు అనేది పెద్ద డిస్కషన్ గా మారింది. పెళ్లి  చూపులు నిర్మాత రాజ్ కందుకూరి తన కొడుకు శివ ని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యాలని చూస్తున్నారు.


ఆ కుర్రాడు ప్రస్తుతం విదేశాల్లో ఎం ఎస్ చేస్తున్నాడు. పెళ్లి చూపులు లాంటి ఒక ఆసక్తికర చిత్రం మరొకటి  తీయాలి అనేది రాజ్ కందుకూరి ఐడియా , సో దాంట్లో ఎవరో హీరోగా ఎందుకు తన కొడుకు నే హీరోగా పెడదాం అని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. దానికోసం అతన్ని హీరోగా పరిచయం చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే శివానీ ఓకే అయినట్టు తెలుస్తోంది 

మరింత సమాచారం తెలుసుకోండి: