కమలహాసన్ కుమార్తె గానే కాకుండా దక్షిణాది సినిమా రంగంలో శ్రుతిహాసన్ కు టాప్ హీరోయిన్ స్టేటస్ ఉంది. ఏ విషయం పై అయినా తన తండ్రిలాగే చాల స్పష్టంగా మాట్లాడే శ్రుతిహాసన్ ప్రస్తుతం లండన్ కు చెందిన మైఖేల్ కోర్సేల్‌ తో పీకల్లోతు ప్రేమలో ఉంది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. 

వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు మీడియాకు లీక్ కావడం ఇదే మొదటిసారి కాకపోయినా ఈమధ్య వీరిద్దరూ ముంబాయి ఎయిర్ పోర్ట్ లో ఒక కారులో గాఢoగా కౌగలించుకున్న ఫోటోలు ఇప్పుడు మీడియాకు లీక్ కావడంతో అవి సంచలనంగా మారాయి. బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం శ్రుతి తన ప్రియుడు మైఖేల్ కోర్సేల్‌ పెళ్ళి చేసుకోవడం కోసమే ‘సంఘమిత్ర’ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అన్న కథనాలు ఉన్నాయి.

ఈమధ్య వీరిద్దరు ఇలా ఓపెన్ రోమాన్స్ ముంబాయ్ ఎయిర్ పోర్ట్ లో చేసినట్లు తెలుస్తోంది. లండన్ నుంచి వచ్చిన మైఖేల్‌ను చూసి ఆనందంతో పరవశించిపోయిన శృతి తన పక్కన పలువురు మీడియా ఫోటో గ్రాఫర్లు ఉన్నారు అన్న విషయం కూడ పట్టించుకోకుండా శ్రుతి తన ప్రియుడుని చూడగానే ఒకేసారి కారులోకి దూకి వెంటనే తన కౌగిలిలో బంధించింది అని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.

ఈ సంఘటనను చాల మీడియా కెమెరాలు ఫోటోలు తీస్తున్నా శ్రుతి ఏమాత్రం పట్టించుకొకపోవడమే కాకుండా ఎటువంటి అభ్యంతరాన్ని తేలపనట్లు తెలుస్తోంది. మైఖేల్ ఒడిలో ఒదిగి తన్మయత్వంతో ఊగిపోతున్న ఆమెను అనేక మీడియా కెమెరాలు రికార్డ్ చేసి ఇప్పుడు ఆవార్తలను ఫోటోలతో సహా అందరికీ షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నాయి. 

వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం లేని శ్రుతిహాసన్ ఇప్పుడు మైఖేల్ తో పీకల లోతులో మునిగిపోవడమే కాకుండా వీరిద్దరు త్వరలో పెళ్ళి చేసుకుంటున్నారు అని వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తన గురించి ఎవరు ఏ వార్తలు వ్రాసుకున్నా పట్టించుకోను తన వ్యక్తిగత జీవితం తన ఇష్టం అంటూ ఈమధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన శ్రుతి ఓపెన్ రోమాన్స్ ఇప్పుడు ఎవరకీ అర్ధంకాని అంశంగా మారింది అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: