తెలుగు బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారు. మొదట్లో బిగ్ బాస్ పెద్దగా ఆకర్షించకపోయినా..రాను రాను కొన్ని ట్విస్ట్ లు రావడంతో ఈ ప్రోగ్రామ్ పై ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంటుంది. మొదటగా నటి జ్యోతి ఎలిమినేషన్ కావడం..ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా వెళ్లి పోవడం. చిన్న చిన్న గొడవలు..బుజ్జగింపులు ఇలా రోజు రోజు కీ కాస్త ఆసక్తి నెలకొంటుంది.
ఇక ఎన్టీఆర్ శని, ఆదివారల్లో వస్తూ ఈ ప్రోగ్రామ్ కి మరింత బూస్టింగ్ ఇస్తున్నారు. బిగ్ బాస్ లో మధు ప్రియ ఎలిమినేట్ అయ్యాక..సంపూ ప్లేస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో దీక్ష పంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మద్య బిగ్ బాస్ లో చాలా వెరైటీ టాస్క్ లు ఇస్తున్నారు. వీటిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. తమిళంలో అయితే ఏకంగా కోర్టు కే ఎక్కారు.
తాజాగా బిగ్ బాస్ లో సరదా టాస్క్ ఇచ్చారు ..ఈ టాస్క్పై పూర్తి అధికారాన్ని హౌస్ కెప్టెన్ ఆదర్శ్కి ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకాకం బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు ఎలా ఉండాలనే నిర్ణయం ఆదర్శక్ ఇవ్వడం..ఆయన సూచించిన ప్రకారం కంటెస్టెంట్ నడుచుకోవాలీ అనడం కాస్త వెరైటీగా ఉంది. అంతే కాకుండా ఇద్దరికి సంకెళ్లు వేయాలని అందులో ఒకరికి కళ్లగంతలు కట్టాలని టాస్క్లో ఉండటంతో ఉప్పు నిప్పులా ఉన్న దీక్ష-అర్చనలకు సంకెళ్లు వేశాడు ఆదర్శ్.
ఇక కెప్టెన్ ఆదర్శ్తో మాట్లాడాలనుకునే వాళ్లు అతడికి ముద్దు పెట్టాలనే నిబంధన పెట్టడంతో ప్రిన్స్ పదే పదే ఆదర్శ్తో మాట్లాడుతూ ముద్దులు మీద ముద్దులు పెట్టేశాడు. మరోవైపు హరితేజకు మాటలను కూడా పాటలుగా పాడాలనే టాస్క్లో నిబంధన ఉండటంతో ఆమె మాటల పాటలు ఈ ఎపిసోడ్కే హైలైట్గా నిలిచాయి. అంతే కాదు బిగ్ బాస్ హౌజ్ లో అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత బిగ్ బాస్ నెక్ట్ వీక్లో ఎలిమినేషన్స్ కోసం కల్పన, మహేష్ కత్తి, దీక్ష, శివ బాలాజీ, హరితేజ పేర్లను అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి ఈ ఐదుగురిలో ఒకరు ఈవారంలో ఎలిమేట్ కాబోతున్నారు.