తెలుగు బుల్లితెరపై వస్తున్న పాపులర్ రియాల్టీషో ‘బిగ్ బాస్’ ఇప్పటికే 23 రోజులు పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ షో నుంచి ఇప్పటి వరకు నటి జ్యోతి, మధు ప్రియ, సమీర్ ఎలిమినేట్ అవగా..బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మానసిక పరిస్థితి బాగాలేదని తప్పుకున్నాడు. సంపూ స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నటి దీక్షా పంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  మొదటి వారంలో బిగ్ బాస్ కాంటెస్ట్ ల మద్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగారు.  రాను రాను చిత్ర విచిత్రమైన టాస్క్ లో హౌజ్ లో ఉన్నవారికి దిమ్మతిరుగుతుంది.  

అంతే కాదు చిన్న చిన్న వివాదాలు, బుజ్జగింపులు, కోపాలు తాపాలు ఇలా రోజు రోజు కీ ఈ షోపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.   బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ శని, ఆదివారాల్లో చేస్తున్న సందడి తో ఈ షోకి రేటింగ్ అమాంతం పెరిగిపోయింది.  మొన్నటి ఆదివారం హీరో రానా కూడా ఎంట్రీ ఇచ్చి మరింత ఎంట్రటైన్ మెంట్ చేశారు.  నిన్నటి బిగ్ బాస్ షో లో ఐదు కుర్చిల్లో సభ్యులు కూర్చొవాలి. మొదటి రౌండ్ లో అర్చన, శివబాలాజీ, కల్పన, హరితేజ,ప్రిన్స్ కూర్చున్నారు.  

ఇక ఈ టాస్క్ బాధ్యతలు కత్తి మహేష్ కి అప్పజెప్పారు బిగ్ బాస్.  కుర్చిలో కూర్చున్న వారిని  ఎలాగైనా ఆ సీట్ లోంచి లేపితే టాస్క్ ఓడిపోయినట్లే..అందు కోసం మరో బ్యాచ్ లో సభ్యులు కత్తి కార్తిక, ఆదర్శ్, ధన్ రాజ్, ముమైత్ ఖాన్, దీక్షా పంత్ నానా రకాలుగా పన్నాగాలు పన్నారు.  ఈ సందర్భంగా కత్తి కార్తీక పిండితో చేసిన ఓ బల్లిని ఆదర్శ్ తీసుకు వచ్చి అర్చన కూర్చున్న కుర్చీపై ఉంచారు.  

అప్పటి వరకు హ్యాపీగా మాట్లాడుతున్న అర్చన తన పక్కన ఉన్నది బల్లి అనుకొని గుండె గుభేల్ మంది. అంతే కెవ్ ....మంటూ కేకలు వేసి మమ్మీ..మమ్మీ..అంటూ ఎడ్చేసింది.  వెంటనే ధన్ రాజ్ వెళ్లి అర్చనను ఓదార్చు.  తర్వాత ఇది నిజమైన బల్లి కాదని దాన్ని పట్టుకొని పిండి చేశారు. వెంటనే అర్చన ఊపిరి పిల్చుకుంది..ఏడుపు ఆపేసింది.  

ఆ తర్వాత వారి సెకండ్ బ్యాచ్ వారు కూర్చున్న తర్వాత ఫస్ట్ బ్యాచ్ లో బాలాజీ, ఆదర్శ్ ల మద్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. తర్వాత బాలాజీ నీతో మాట్లాడటం వేస్ట్ నీది అసలు క్యారెక్టర్ కాదు అంటూ తిట్టుకుంటూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఇలా రోజు రోజుకీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: