దగ్గుబాటి రానా సీనియర్ డైరక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మొదట మాములు టాక్ తెచ్చుకున్నా చిన్నగా సినిమా జనాల్లోకి ఎక్కేస్తుంది. జోగేంద్రగా రానా, రాధగా కాజల్ నటించిన ఈ సినిమా హిట్ అవుతుందని ముందే చెప్పేశాడట విక్టరీ వెంకటేష్.


ఫైనల్ ఎడిటింగ్ అయ్యాక సినిమా చూసిన వెంకటేష్ సినిమా బాగుందని రానాకు ఓ హిట్ ఇస్తున్నావని చెప్పారట. అదే మాట ఇప్పుడు నిజం అయ్యిందని అన్నారు నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ మీట్ లో డైరక్టర్ తేజ. ఇక ఈ సినిమాలో జోగేంద్ర పాట కూడా వెంకటేష్ సినిమా కోసం కంపోజ్ చేయించిందట. ఆ విషయం కూడా సక్సెస్ మీట్ లో వెళ్లడించాడు తేజ. 


ఇక తాను కూడా హిట్ సినిమాలను తీయగలనని.. తన మీద తనకే నమ్మకం వచ్చిందని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా డిజాస్టర్స్ తీస్తున్న తేజ రానాతో చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోదగినదే. లాంగ్ వీకెండ్ లో వచ్చిన ఈ సినిమా చిన్నగా ఆడియెన్స్ మనసులను గెలిచేస్తుంది. ఇక సినిమాకు వస్తున్న రెవిన్యూ చూసి తనకే షాకింగ్ గా ఉందని అన్నారు దగ్గుబాటి రానా.


కొత్తదనంతో వచ్చే సినిమాలు కేవలం తెలుగులోనే హిట్ అవుతాయని.. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాల మీద ఇండియన్ సినిమా ఓ కన్నేసి ఉంచిందని అన్నారు. తన ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు రానా. సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రానా వరుసగా ఘాజి, బాహుబలి-2, నేనే రాజు నేనే మంత్రిలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు.   



మరింత సమాచారం తెలుసుకోండి: