నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజ్ భవన్ లో గవర్నర్ ఏర్పాటు చేసిన 'ఎట్‌హోం' కార్యక్రంలో సందడి చేయడం అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా అత్యంత ప్రాముఖ్యత కలిగిన న్యూస్ గా మారింది. సామాన్యంగా  ఫంక్షన్స్ కు పార్టీలకు దూరంగా ఉండే పవన్ తన తీరు మార్చుకుని ఈమధ్య జరుగుతున్న చాలామంది ప్రముఖుల పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ లోను అదేవిధంగా గవర్నర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటూ తన తీరు మారిపోయింది అన్న సంకేతాలు పవన్ ఇస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోంది.

కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయిన తరువాత నిన్న మన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి వచ్చి అందరికీ షాక్ ఇచ్చి తాను మారిపోయిన జనసేనాధిపతిని అన్న సంకేతాలు ఇచ్చాడు. దీనికితోడు పవన్ వచ్చే అక్టోబర్ నుండి తాను ప్రజల మధ్యకు వెళ్ళబోతున్నాను అని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన నేపధ్యంలో దానికి కొనసాగింపు గానే నిన్నటి పవన్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమ సందడి అని అంటున్నారు.

 ప్రస్తుతం పవన్ అనుసరిస్తున్న వ్యూహాలవల్ల అదేవిధంగా అతడి మౌనం వల్ల పవన్ రాజకీయ నాయకుడి స్టేటస్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో తన వైపు నుంచి క్లారిటీ ఇవ్వడానికి పవన్ ఈ విధంగా తన స్పీడ్ పెంచాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు నిన్న జరిగిన 'ఎట్‌హోం' కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు పాల్గొన్నా పవన్ మాత్రమే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ గా మారడంతో మీడియా కెమెరాల దృష్టి ఛానల్స్ దృష్టి అంతా పవన్ చుట్టూనే తిరిగింది. 

ఇటీవల ‘జనసేన’ పార్టీ నిర్మాణం చేపట్టి జనంలోకి వేళుతున్నట్లుగా చెప్పిన పవన్ ను ఇలా జనంలోకి తీసుకొచ్చే ఆలోచన వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆలోచనలు ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా మొన్న ఉద్దానం పేరుతో మీడియా ముందుకు వచ్చిన పవన్ ఇప్పుడు ‘ఎట్ హోం’ కార్యక్రమంలో సందడి చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

నిన్నటి కార్యక్రమానికి పవన్ చాల హుషారుగా రావడమే కాకుండా ఆ కార్యక్రమానికి వచ్చిన చాలామంది ప్రముఖులను పలకరించిన తీరును చూసి తాము చూస్తున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏనా ? అన్న సందేహాలు చాలామంది ప్రముఖులు వ్యక్తం చేసినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: