దిల్ రాజ్ కు  నిర్మాతగా ఈఏడాది కలిసి వచ్చినట్లుగా మరి ఏసంవత్సరం అతడికి గతంలో కలిసిరాలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని షాక్ లు తగిలినా వాటిని లెక్క చేయకుండా నిర్మాతగా దిల్ రాజ్ తీస్తున్న పరుగులు టాపిక్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఇది ఇలా ఉండగా దిల్ రాజ్ దృష్టి ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీల పై పడింది అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి  తెలుగులో దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ కోట్లు కొల్లగొట్టే స్టార్స్ ఉన్నా ఇంకా ఇద్దరు బడా హీరోలు కలిసి ఓ సినిమాను చేయడం కుదరడంలేదు. 

అప్పుడప్పడు వెంకటేష్ అటువంటి ప్రయత్నాలు చేస్తున్నా అవి పెద్దగా విజయవంతం కావడం లేదు.  ఇలాంటి పరిస్థితులలో ఆ స్థాయిలో కాకపోయినా మీడియం హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి దిల్ రాజ్ ప్రయత్నిస్తున్నట్లు టాక్. ‘డీజే’ సినిమా హిట్ అని చెప్పి చివరికి నెగిటివ్ టాక్ నే తెచ్చుకొని విమర్శల టార్గెట్ కు గురి కాబడ్డ హరీష్ శంకర్ కు మరో అవకాశం ఇవ్వాలని దిల్ రాజ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

హరీష్ శంకర్ లేటెస్ట్ గా చెప్పిన కథ దిల్ రాజ్ కు నచ్చడంతో ఆ కధను దిల్ రాజ్ మీడియం హీరోలతో  మల్టీ స్టారర్ గా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో నాని శర్వానంద్  కాంబినేషన్  సెట్ చేయాలని  దిల్ రాజ్ ప్లాన్ అని అంటున్నారు. 

అయితే ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ కుదరకపోతే మరో ఇద్దరు హీరోల కాంబినేషన్ గురించి కూడ దిల్ రాజ్ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.  మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్  ని ప్రస్తుతం ఫెయిల్యూర్ హీరో గా ముద్రవేయించుకున్న వరుణ్ సందేశ్ తో ఈ కాంబినేషన్ ఉండబోతోంది అని కూడ అంటున్నారు. ఇప్పటికే ఈ మోవిఈకి దిల్ రాజు ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ ని కూడా రీజిస్టర్ చేయించైనా నేపధ్యంలో ఈనాలుగు హీరోలలో ఏదో ఒక కాంబినేషన్ సెట్ అవుతుంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: