ఒకప్పుడు బుల్లితెరపై వచ్చే సిరియల్స్ అంటే ఎంతో ఆసక్తితో వీక్షించేవారు ప్రేక్షకులు. గత కొంత కాలంగా వస్తున్న సీరియల్స్ చూస్తుంటే చీ ఇంత నీచంగా కూడా తీస్తారా అని అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే సీరియల్స్ లో వచ్చే నటీమణులు వెండితెరపై కనిపించే హీరోయిన్స్ కన్నా బీభత్సంగా తమ అందాలు చూపిస్తున్నారు. కొంత మంది రియాల్టీ షోకి వచ్చే యాంకర్లును చూస్తుంటే తమ అందాల ప్రదర్శన కోసమే ఈ ప్రోగ్రామ్ ఉందన్నట్లు షో చేస్తున్నారు.
తాజాగా హిందీలో ప్రసారం అవుతున్న ఓ సీరియల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాన్ చేయాలంటూ ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకే విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాదు ఈ సీరియల్ బ్యాన్ చేయాలని ఆన్ లైన్ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోనీ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న " పెహ్రిదార్ పియా కీ " అనే సీరియల్ ప్రసారం అవుతుంది. ఇందులో ఓ పదేళ్ల పిల్లోడిని.. 20 ఏళ్ల యువతి పెళ్లి చేసుకుంటుంది. నుదుటిపై కుంకుమ దిద్దుతాడు. ఇద్దరి మధ్య భార్య, భర్తల సన్నివేశాలు కూడా ఉంటాయి.
ఒక ఎపిసోడ్ లో పదేళ్ల పిల్లోడి శోభనం గదిలోని అల్లరిని కూడా చూపించేశారు. హనీమూన్ డిస్కసన్ తో డైలాగ్స్ పేల్చారు. దీంతో ఆగ్రహించిన నెటిజన్లు రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోందని, ఇది బాల్య వివాహాలను ప్రోత్సహించేలా, చిన్న పిల్లల మనసులను దిగ జార్చేలా ఉందని అనేకమంది ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.
సోనీ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న " పెహ్రిదార్ పియా కీ " సీరియల్ ను రాత్రి 10 గంటలకు ప్రసారం చేయాలని బీసీసీసీ (బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లయింట్ కౌన్సిల్) ఈ ఛానెల్ నిర్వాహకులను ఆదేశించింది. కాగా, బాల్య వివాహాలను ప్రోత్సహించడం లేదని, ఇది కేవలం కల్పితమేనని స్క్రోలింగ్ వేయాలని కూడా సూచించింది.