ప్రిన్స్ మహేష్ బాబు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరితోనూ పెద్ద సన్నిహితంగా ఉండడు. దీనికితోడు మహేష్ పార్టీలకు ఫంక్షన్స్ కు బాగదూరంగా ఉంటాడు కాబట్టి మహేష్ తో సన్నిహిత సంబంధాలు చాలతక్కువ మందికి ఉన్నాయి. అటువంటి మహేష్ ఈమధ్య ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ తో చాలసన్నిహితంగా ఉంటున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘కంత్రీ’ ‘శక్తి’ ‘షాడో’ వంటి ఘోర పరాజయాలను చూసిన దర్శకుడు మెహర్ రమేశ్ తో మహేష్ బాబు ప్రస్తుతంచాల సన్నిహితంగా ఉంటూ ఉండటం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. గతవారం మొదలైన వంశీపైడిపల్లి మహేష్ ల మూవీ ప్రారంభోత్సవ వేడుకలలో కూడ ఈఫెయిల్యూర్ డైరెక్టర్ చాల హడావిడిగా తిరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

ప్రస్తుతం మహేష్ ఎక్కడ ఉన్నా ఆయన వెనుక మెహర్ మహేష్, మహేష్ కూతురు సితార ఎక్కడ ఉన్నా ఆఅమ్మాయి ముందు మెహర్ రమేశ్ కూతురు కూడ సందడి చేస్తూ ఉండటంతో ఈకొత్త బాంధవ్యం ఏమిటి అని ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి వీరిద్దరి పరిచయం మహేష్ నటించిన ‘బాబి’ సినిమా నుండి మొదలైనా ఈమధ్య కాలంలో వీరిద్దరి స్నేహం బాగా పెరిగిపోయింది అన్నవార్తలు గుప్పు మంటున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు కొంతకాలం క్రితం మెహర్ రమేశ్ మహేష్ తో ఒక కార్పోరేట్ యాడ్ ను తీయడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుందా అని అనుకున్నారు అంతా. అయితే అసలువిషయాలు ఇప్పుడు బయట పడుతున్నాయి అని తెలుస్తోంది. 

మహేష్ వచ్చే సంవత్సరం నుండి అమరావతి ప్రాంతంలో ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ ను ప్రారంభిస్తున్న నేపధ్యంలో మెహర్ రమేశ్ ఇప్పుడు ఆ విధ్యా సంస్థ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నట్లు టాక్. దీనికితోడు మెహర్ రమేశ్ కు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో మంచిపరిచయాలు పట్టు ఉండటంతో మహేష్ తాను ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించబోయే వ్యాపారాలకు సంబంధించి మెహర్ రమేశ్ వద్ద సలహాలను తీసుకోవడమే కాకుండా కొన్ని వ్యాపారసంస్థల నిర్వాహణ బాధ్యతలను ఈఫెయిల్యూర్ డైరెక్టర్ కు అప్పగించే ఆస్కారం ఉంది అన్న గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతానికి సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న ఈఫెయిల్యూర్ డైరెక్టర్ ను మహేష్ ఈవిధంగా ప్రోత్సహిస్తున్నాడనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: