ఈమధ్య కాలంలో బుల్లితెర రియాలిటీ షోలలో వాటి రేటింగ్స్ కోసం మితిమీరిన ద్వందార్ధాలతో కూడిన సంభాషణలతో ఆ షోలను నిర్వహిస్తున్నారు. ఛానల్స్ మధ్య పోటీ పెరిగి పోవడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అని కొందరు అభిప్రాయ పడుతూ ఉంటే ప్రేక్షకులు ఇటువంటి సంభాషణలను ఎంజాయ్ చేస్తున్నారు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.

ప్రస్తుతం బుల్లితెర పై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న షోలలో రానా ‘నెంబర్ వన్ యారి’ షో టాప్ 3 స్థానాలలో కొనసాగుతోంది. అయితే ఈ షోలో కూడ బూతులు చోటు చేసుకోవడం కొంతమందిని ఆశ్చర్య పరుస్తూ ఉంటే మరి కొందరు ఈ వింతపోకడ పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. 

ఇక వివరాలలోకి వెళితే రానా వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న  ‘నెంబర్ వన్ యారి’  షోలో మంచు లక్మి ప్రసన్న తాప్సి గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ రేపు ఆదివారం ప్రసారం కాబోతోంది. దీనితో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమోని ఆ కార్యక్రమం ప్రసారం చేస్తున్న ఛానల్  తరుచు టెలికాస్ట్ చేస్తోంది. 

ఇందులో తాప్సి మంచు లక్ష్మితో మాట్లాడుతూ తాను రానాకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నానని ఎందుకంటే రానా పెద్ద కండలు మరియి అతని పెద్ద హార్ట్ చూసి పడిపోయా అంటూ మంచు లక్ష్మితో అంటుంది. అయితే దీనికి సమాధానంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ తనకు రానా విషయంలో ఏది పెద్దగా ఉందొ తెలుసుకోవలిసిన అవసరం లేదని కామెంట్ చేసింది. 

ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ కి రానా పకపకా నవ్వడం చూసిన బుల్లితెర ప్రేక్షకులు ఈ అడల్ట్ జోక్ కు కొందరు నవ్వుకుంటే మరికొందరు రానా లాంటి టాప్ సెలెబ్రెటీల షోలలో కూడా బూతుల వ్యవహారం ఏమిటి అంటూ ఘాటైన సెటైర్లు వేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సగటు బుల్లితెర ప్రేక్షకుడు కూడ అడల్ట్ జోక్స్ ను ఇష్ట పడుతున్న నేపధ్యంలో బుల్లితెర పై కూడ విలువలు పడిపోతున్నాయి అన్నది వాస్తవం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: