అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ప్రారంభం అయి చాల కాలం అయిపోయినా ఆ మూవీకి సంబంధించిన స్టిల్స్ పెద్దగా బయటకు రావడం లేదు. ఈమూవీకి సంబంధించి అనేక ఆలోచనలు చేసిన తరువాత అఖిల్ పక్కన హీరోయిన్ గా ప్రముఖ మళయాళ దర్శకుడు ప్రియదర్శిన్ కుమార్తె కల్యాణిని ఎంపిక చేసారు. 

ఈమధ్యనే ఈమె షూటింగ్ స్పాట్ కు జాయిన్ అవ్వడంతో అఖిల్ కల్యాణిల మధ్య రొమాంటిక్ సీన్స్ ను తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ స్టిల్ ను అఖిల్ తన ట్విటర్ లో తన అభిమానులకోసం షేర్ చేసాడు. 

ఈమూవీని డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ కుమార్ ఒక క్యూట్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా తీస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ను ఈ నెల 21న విడుదలచేసి తన అభిమానులకు జోష్ ఇవ్వాలని అఖిల్ ప్రయత్నిస్తున్నట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కథ నాగార్జున నటించిన ‘శివ’ ఛాయలతో కొద్దిగా ‘విక్రమ్’ టచ్ లతో ఉంటుందని అంటున్నారు. నాగార్జున స్వయంగా దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈసినిమాను డిసెంబర్ లో విడుదల చేయాడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ‘హలో గురు ప్రేమకోసమే’ ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ ‘రంగుల రాట్నం’ అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఎట్టి పరిస్తుతులలోను అఖిల్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తీరాలి అని చేస్తున్న ప్రయత్నాలలో ఈమూవీ విషయాలను స్వయంగా నాగార్జున పరిశీలిస్తూ ఎటువంటి అనుకోని పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: