ఊర మాస్ డైరక్టర్ గా బోయపాటి శ్రీనుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరో ఎవరన్నది కాదు దర్శకుడు ఎవరన్నది చూసి సినిమాకు వెళ్లేలా దర్శకత్వ ప్రతిభను చాటే కొంతమంది బడా దర్శకులలో బోయపాటి ఒకరు. సరైనోడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమా తీశాడు ఈ దర్శకుడు. 


రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ అయ్యి మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఆరోజు రిలీజ్ అయిన మిగతా రెండు సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వసూళ్ల హంగామా చేస్తుంది. బోయపాటి మార్క్ తో వచ్చిన జయ జానకి నాయకా సినిమా రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతుంది.


ఇక ఆరోజు వచ్చిన నితిన్ లై నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో జయ జానకి నాయకా సినిమా రెండో వారంలో కూడా థియేటర్స్ ఎక్స్ ట్రా యాడ్ చేసుకుంటుంది. ఇదో రకంగా బోయపాటి అసలైన విజయమని చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాలకు తన ఊర మాస్ అంశాలతో పాటు ఎమోషన్స్ కూడా చేర్చి బోయపాటి దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు.


బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కుర్ర హీరోతో ఇలాంటి ఫీట్ చేయడం బోయపాటి శ్రీను గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. రెండో వారంలో కూడా థియేటర్స్ పెంచుతున్నారంటే కచ్చితంగా సినిమా బోయపాటి ఎకౌంట్ లో మరో హిట్ పడ్డట్టే. ఈ హిట్ తో మరింత జోష్ పెంచుకున్న బోయపాటి శ్రీను తన తర్వాత సినిమాలు బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ లతో చేయాలని ఫిక్స్ అయ్యాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: