‘బాహుబలి 2’  తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా  ‘బాహుబలి’ స్థాయిలో విజయం సాధించి ‘బాహుబలి’ ద్వారా వచ్చిన ఇంటర్నేషనల్ క్రేజ్ ను ప్రభాస్ కొనసాగించగలడా ? లేడా ? అన్న విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై  ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఒక నెగిటివ్ న్యూస్ ప్రభాస్ అభిమానులను కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 సెంటిమెంట్స్ ను బలంగా విశ్వసించే సినిమా ఇండస్ట్రీలో ‘సాహో’ సెంటిమెంట్ ప్రభాస్  అభిమానుల పాలిట శాపంలా మారుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోతీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా భాగస్వామ్యం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ను కూడ  ఈమూవీలో కీలక పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఇప్పటివరకు జాకీ ష్రాఫ్ నటించిన మూడు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫ్లాప్ లు గా మారాయి. అందులో మంచు విష్ణు నటించిన ‘అస్త్రం’ సినిమా ఒకటి అయితే మిగతా రెండు స్టార్ హీరోలతో  తీసిన పవన్ ‘పంజా’ మరియు ఎన్టీఆర్ ‘శక్తి’ చిత్రాలు. దీని తో సాహో సినిమాకు జాకీ ష్రాఫ్ ఉన్నాడని వస్తున్న వార్తలు నిజం కాకపోతే బాగుండని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. 

దీనికితోడు ఈసినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన శ్రద్దా కపూర్ వల్ల ‘సాహో’ సినిమాకు ఏమాత్రం క్రేజ్ పెరగదు అని ఇప్పటికే ప్రభాస్ అభిమానులు కలవర పడుతున్నారు. దీనికితోడు శ్రద్దా కపూర్ ఐరన్ లెగ్ సెంటిమెంట్ కూడ ప్రభాస్ అభిమానులను భయ పెడుతోంది. దీనితో ఇన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ అధికమించి ‘సాహో’ రికార్డులను ఎలా క్రియేట్ చేస్తుంది అన్న భయాల మధ్య ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు తెగ మధన పడిపోతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: