రాంచరణ్ హీరోగా ఏకంగా 30కోట్లు ఖర్చుపెట్టి తీసినా సినిమా కేవలం ఏడురోజులే ఆడుతుందా.. ఆవిషయం రాంచరణ్ తో పాటు నిర్మాతకు కూడా తెలుసా... అంటే అవుననే సమాధానం ఇస్థున్నాయి టాలీవుడ్ వర్గాలు.

కారణం బాబాయ్ హీరోగా వస్థున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ‘ఎవడు’ సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా ఏడురోజులకే విడుదలవుతోంది. పవర్ స్టార్ పవణ్ సినిమా ముందు చెర్రీసినిమా నిలవడం కష్టమన్న అభిప్రాయాలను టాలీవుడ్ వర్గాలు వ్యక్థం చేస్థున్నాయి. అలా కాకున్నా అంత భారీ బడ్జెట్ తో సినిమా విషయంలో ఇంత రిస్క్ తీసుకోరు.

అందుకే ఈ సినిమా ‘అత్తారింటికి దారేది’ కంటే బంపర్ హిట్టు అవుతుందన్న అతినమ్మకం అయినా ఉండాలి, లేదా కథ ముందే తెలుసు కాబట్టి ఇది ఎంత ఆడినా ఏడురోజులే, ఈ లోపే కలెక్షన్లు కలెక్ట్ చేసుకోవాలి అన్న ఆలోచనైనా ఉండాలి అంటున్నాయి సినీవర్గాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: