సినిమా విమర్శకుడిగా పేరుగాంచిన మహేష్ కత్తి ‘బిగ్ బాస్’ షోలో పాల్గున్న తరువాత సేలేబ్రెటీగా మారిపోయాడు.  ‘బిగ్ బాస్’ షో ముందు వరకు సినీ ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే మహేష్ కత్తి పేరు తెలుసు. అయితే  ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అడుగుపెట్టిన తరువాత మరీ ముఖ్యంగా ఆ షో నుండి ఎలిమినేట్ అయిన తర్వాత  ఇతడు సెలబ్రిటీగా  మారిపోవడమే కాకుండా చాలా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రస్తుతం బిజీగా రోజులు గడుపుతున్నాడు. దీనికితోడు  మహేష్ కత్తి ప్రస్తుతం ఏమి చెప్పినా అది సంచలన వార్తగా మారుతోంది. 

ఈ నేపధ్యంలో ఈ సినీ విమర్శకుడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. ‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్  రాజకీయ వ్యవహార శైలిపై  సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ట్వీట్స్ కు బహిరంగ సభలకే పరిమితం అవుతున్నాడు అంటూ మరో వివాదానికి తెరతీసాడు.

ప్రస్తుతం పవన్ ప్రశ్నించడం తప్పించి సమస్యల పట్ల తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఆ సమస్యలకు పరిష్కారాలను చెప్పకుండా వ్యవహరిస్తున్న తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు మహేష్ కత్తి అభిప్రాయ పడుతున్నాడు. మరొక విధంగా చెప్పాలి అంటే పవన్ సోషల్ మీడియాలో స్పందించే విధానం కంటే తాను తన ఫేస్ బుక్ లో అనేక సమస్యల పై ఎంతో ఎక్కువగా వ్రాస్తున్నానని అయితే కేవలం సమస్యల పై మాట్లాడినంత మాత్రాన తనను కూడ ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ తన పై తాను జోక్ చేసుకున్నాడు కత్తి మహేష్. 

పవన్ సామాజిక సమస్యల పై వ్యక్తపరుస్తున్న భావాలకంటే తాను చాల ఎక్కువగా స్పందిస్తున్నాను అంటూ పవన్ ఒక రోజు చెప్పిన మాటలకు రెండో రోజు చెప్పిన మాటలకే పొంతన ఉండడం లేదు లేదు అంటూ పవన్ ను టార్గెట్ చేస్తూ ఈ విమర్శకుడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  ఒక రాజకీయ పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ సిద్ధాంతాలకనుగుణంగా పోరాడాలి గానీ కేవలం గతంలో ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాష్ నారాయణ్ స్పందించిన విధంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ టైం పాస్ కోసం రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఈ ఫిలిం క్రిటిక్ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులలో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: