తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని  దర్శకదీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.  అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ  ఇచ్చిన రాజమౌళి మొదట బుల్లితెరపై ‘శాంతి నివాసం’సీరియల్ తో తన ప్రస్థానం మొదలు పెట్టి ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.  అప్పటి నుంచి ‘బాహుబలి 2’ చిత్రం వరకు తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు.  అంతే కాదు తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రాలు భారత దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు నెలకొల్పింది.
Image result for syera narasimha
 ఇక ‘బాహుబలి’ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా  అవార్డు కైవసం చేసుకుంది.  దీంతో తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో రాజమౌళితో చిత్రాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.  అలాంటి రాజమౌళి ఇమేజ్ ఇప్పుడు స్టార్ హీరోలు కూడా బాగానే ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తుంది.  నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.  తాజాగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా చేసిన 'జై లవ కుశ' విడుదలకు ముస్తాబవుతోంది.
Image result for syera narasimha
దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక సెప్టెంబర్ 3 వ తేదీనా గ్రాండ్ గా జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.  ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రాజమౌళి రానున్నారని... ఆయన చేతుల మీదుగా ఆడియో రిలీజ్ జరగనుందని అంటున్నారు.
Image result for ntr rajamouli
ఇప్పటికే ఎన్టీఆర్ తో మూడు చిత్రాలు తీసిన రాజమౌళి ఆయనపై అభిమానంతో ఫంక్షన్ కి వస్తున్నట్లు తెలుస్తుంది.  సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనే టాక్ రావడంతో, అంతా ఆడియో రిలీజ్ పై దృష్టి పెట్టారు.  ఎన్టీఆర్ మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: