తెలుగు ఇండస్ట్రీలో వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించి నాలుగో చిత్రంతో మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్న యంగ్ హీరో ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకునే వార్త ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ సెన్సార్బోర్డ్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు తీపి కబురు చెప్పారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ రామ్ నిర్మాత గా వ్యవరిస్తున్న ‘జై లవ కుశ’ చిత్రంలో నటించారు.
ఇప్పటికే టీజర్తో ఆకట్టుకుని.. సాంగ్స్తో ప్రేక్షకుల మదిని గెలుచుకుని.. ట్రైలర్తో అంచనాలను పెంచేసింది. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పూర్తి కావడం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలిపింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. జై లవకుశ.. రివ్యూను సెన్సార్ బోర్డ్ సభ్యుడు ముందే చెప్పేశారు.
దుబాయిలో ఉండే ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్బోర్డ్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు.. జై లవకుశ సెన్సార్ టాక్ చెప్పడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. ఉమర్ సిందూ చెప్పిన ప్రకారం సినిమా మాస్ ఎంటర్టైనర్గా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంటుందనీ, మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఇరగదీశారని ఆయన ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్బస్టర్ ఖాయమన్నారు. అంతే కాదు తమన్నా ప్రత్యేక గీతం స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెబుతున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కల్యాణ్ రామ్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి.