టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ, ప్రిన్స్ మహేష్బాబు స్పైడర్ సినిమాలు రెండూ ఈ దసరా రేసులో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ పోరులో జై లవకుశ ఆరు రోజులు ముందుగా ఈ నెల 21న థియేటర్లలోకి వస్తోంది. ఇక 27న స్పైడర్ బరిలోకి దిగుతోంది. రెండు సినిమాలు భారీ బడ్జెట్తోనే తెరకెక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్లోనూ ఈ రెండు సినిమాల మధ్య పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రి రిలీజ్ బిజినెస్, థియేటర్లు, బెనిఫిట్ షోలు, ఫస్ట్ డే కలెక్షన్లు, టోటల్ కలెక్షన్లు ఇలా అన్ని విషయాల్లోను ఈ రెండు సినిమాల మధ్య ఎన్టీఆర్, మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ జనాలందరూ కంపేరిజన్ చేయనున్నారు. ఇక రెండు సినిమాల థియేటర్లను ఇప్పటికే ప్రకటించారు. ఓవర్సీస్లో స్పైడర్ 400 పైగా లొకేషన్లలో 800 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నామని యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్ జై లవకుశ అమెరికాలో దాదాపు 200 లొకేషన్లలో 500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఓవర్సీస్లో ప్రీమియర్ల విషయంలో జై లవకుశ కంటే స్పైడరే పై చేయి సాధించినట్టు తెలుస్తోంది.
అయితే స్పైడర్ బడ్జెట్ ఎక్కువ కావడంతో పాటు తెలుగు, తమిళ భాషలతో పాటు అరబిక్లో కూడా రిలీజ్ అవుతుండడంతో ఆ సినిమాకు కాస్త ఎడ్వాంటేజ్ ఉంది. ఈ రెండు సినిమాలపై ఉన్న భారీ అంచనాలతో అమెరికాలో సహజంగా 16 డాలర్లు ఉండే టిక్కెట్టు ధర 18 డాలర్లు పలుకుతోందని తెలుస్తోంది.