మహేష్ మైక్ ముందుకు వచ్చి మాట్లాడటానికి చాల సిగ్గు పడతాడు. అంతేకాదు ఆ సందర్భంలో మాట్లాడే పదాలు గుర్తుకు రాక తెగ తడబడతాడు. అయితే దీనికి విరుద్ధంగా అనర్గళంగా నిన్న ‘స్పైడర్’ ఫంక్షన్ లో మాట్లాడిన మహేష్ ను చూసి అతడి అభిమానులు మాత్రమే కాకుండా మీడియా వర్గాలు కూడ షాక్ అయ్యాయి. 

ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో హీరోల ఆరాధన విపరీతమైన స్థాయిలో నడుస్తున్న నేపధ్యంలో నిన్నటి ఫంక్షన్ లో కూడ ‘జై జై మహేష్ బాబు’ స్లొగన్స్ విపరీతంగా వినిపించాయి. అయితే తనకు ఈ ‘జై జై’ నినాదాలు వద్దని సున్నితంగా మహేష్ తన అభిమానుల అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేసాడు. 

ఇప్పటి వరకు అనేక సినిమా ఫంక్షన్స్ లో మహేష్ మాట్లాడినా నిన్న ‘స్పైడర్’ ఈవెంట్ లో మహేష్ చేసిన స్పీచ్ అతడి అభిమానులకు ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా తన అభిమానుల మనసులను హత్తుకునేలా మహేష్ స్పీచ్ కొనసాగింది. తన అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లోనే శాస్వితంగా ఉంటారు అని చెపుతూ మహేష్ తన అభిమానులకు మరింత దగ్గర అవ్వడానికి తన వంతు ప్రయత్నాలు చేసాడు.

తనకు దర్శకులు దేవుళ్ళతో సమానం అని అంటూ ఒకసారి కథ విని ఒప్పుకున్నా తరువాత ఆపాత్రలో మెప్పించడానికి తన ప్రాణం పెట్టి పని చేస్తానని అందువల్లనే ‘పోకిరి’ ‘దూకుడు’ ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాలు వచ్చాయని మహేష్ కామెంట్స్ చేసాడు. దీనితో ‘స్పైడర్’ సినిమా గురించి తాను ఎంత కష్టపడ్డాడో అన్యాపదేశంగా తెలియచేసాడు మహేష్. 

ఇక చివరిగా “మీ లాంటి అభిమానులు నాకు తెలిసి ఏ హీరోకు ఉండరు” అని మహేష్ అన్న వెంటనే శిల్పకళా వేదిక అంతా మహేష్ నామస్మరణతో దద్దరిల్లి పోయింది. దీనితో మహేష్ కూడ తన పద్ధతి మార్చుకుని తన అభిమానుల మనసులకు దగ్గర అయ్యే విధంగా మాట్లాడుతూ తన వ్యూహాలను మార్చుకున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. చివరిగా మంచి సినిమాలు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను మీ సహకారం కావాలి అని మహేష్ తన అభిమానులను అడగడం బట్టి ‘స్పైడర్’ విజయానికి సహకరించ వలసిందిగా మహేష్ తన అభిమానులను చాల గట్టిగానే కోరుతున్నట్లు అభిప్రాయం కలగడం సహజం..   



మరింత సమాచారం తెలుసుకోండి: