రాబోతున్న దసరా జూనియర్ మహేష్ మధ్య వార్ గా మారడంతో వారి సినిమాలకు సంబంధించిన వార్తలు కూడ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో ‘జై లవ కుశ’ కు సంబంధించి నందమూరి బ్రదర్స అనుసరిస్తున్న వ్యూహం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈసినిమాకు సంబంధించి విడుదల కాకుండానే నిర్మాత కళ్యాణ్ రామ్ కు భారీ లాభాలు వచ్చినా ఆ లాభాలు అన్నీ పూర్తిగా దాచేసుకోకుండా పబ్లిసిటీ పరంగా చాలా అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ కెరియర్లో నిలిచిపోయే ఘన విజయాన్ని ఇవ్వాలని కళ్యాణ్‌రామ్‌ ఆశ పడుతున్నాడు. 

దీనికోసం ఈసినిమాకు భారీ పబ్లిసిటీ చేయడమే కాకుండా తన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ని టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మార్చే విధంగా ‘జై లవ కుశ’ ను నిలబెట్టడానికి ఈసినిమా భారీ పబ్లిసిటీ కళ్యాణ్ రామ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. దీనికోసం ప్రింట్‌ మీడియా విజువల్‌ మీడియా వెబ్‌ మీడియా అన్నిట్లోను ఎటు చూసినా ‘జై లవ కుశ’ కనిపించేలా కళ్యాణ్ రామ్ ప్లాన్‌ చేసినట్లు టాక్.

ఇది చాలదు అన్నట్లుగా ఈసినిమాకు జనం విపరీతంగా వచ్చే విధంగా ప్రోమోస్‌ కట్‌ చేసి పెట్టారట. టాక్‌ ఎలా వచ్చినా మొదటి వారంలో ఈసినిమా వసూళ్ళ జాతర ఉండితీరాలని పక్కా స్ట్రాటజీతో కళ్యాణ్ రామ్ జూనియర్ లు వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా పబ్లిసిటీకి ఖర్చు పెడుతున్న భారీ మొత్తాలతో ఒక చిన్న సినిమా తీయవచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘జై లవ కుశ’ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దసరా పూర్తి అయ్యే వరకు దాదాపు రెండు వారాల పాటు బాక్స్ ఆఫీసును షేక్ చేయాలని కళ్యాణ్ రామ్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: