హైదరాబాద్ లో తాజాగా జరిగిన స్పైడర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హంగామా తో శిల్ప కళా వేదిక దద్దరిల్లింది. మాహేశ్ బాబు ఫాన్స్ తమ అభిమాన హీరోని చూడడం కోసం శిల్పా రామం దగ్గర క్యూలు కట్టేసారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు ఎస్ జే సూర్య.


సూర్య ని స్టేజీ మీదకి పిలిచిన యాంకర్ సుమ .. సినిమాల్లో కర్కశంగా అందరినీ చంపేసే ఎస్ జే సూర్య తన స్పీచ్ ఎలా ఇస్తాడో చూద్దాం అంటూ ఆహ్వానించింది. అనుకున్నదానికంటే ఎక్కువగా సూర్య తన స్పీచ్ ని అద్భుతంగా ఇచ్చాడు.


మహేష్ బాబు , మురుగదాస్ ఇద్దరితో మంచి సంబంధాలు ఉన్న సూర్య గతం లో మహేష్ తో నానీ తీసినప్పటి నుంచే క్లోజ్ గా ఉంటున్నాం అని చెప్పుకొచ్చాడు.


" ఈ స్పైడర్ సినిమా తెలుగు, తమిళ డైలాగులు ఉన్న సినిమా మాత్రమె కానీ దీని అవుట్ పుట్ మొత్తం హాలీవుడ్ లెవెల్ లో ఉంటుంది. తెలుగు డైలాగులు ఉన్న ఒక హాలీవుడ్ సినిమాగా దీని గురించి చెప్పుకోవచ్చు " అన్నాడు సూర్య. మహేష్ ఫాన్స్ అందరూ తనని తెలుగు లో అంగీకరించాలి అంటూ చమత్కరించి ముగించాడు సూర్య. 

మరింత సమాచారం తెలుసుకోండి: