పూరీ జగన్నాథ్ .. ఈ పేరు చేబితే చాలు సినిమా అభిమానులకి ఫుల్ ఖుషీ వస్తుంది. ఈ మధ్య కాలం లో ఫార్మ్ కోల్పోయినా ఒకప్పుడు తెలుగు సినిమాలో ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చి పవన్ కళ్యాణ్, మహేష్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , చరణ్ లాంటి హీరోలలో యాటిట్యూడ్ ని చూపించాడు పూరీ.


టాప్ డైరెక్టర్ గా ఇప్పటికే ఇండస్ట్రీ లో పెద్ద పేరు ఉన్న పూరీ కి హిట్ ల విషయం లో మాత్రం కాసిన్ని తలనొప్పులు మామూలే అయిపోయాయి. హీరోల ఖాతాలలో , అతని ఖాతాలో ప్లాపులు వేస్తూ వెళుతున్నాడు పూరీ జగనాథ్.


ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరీ కొత్త సినిమా పైసావసూల్ మొదటి రోజు ఓపెనింగ్ లు తప్ప రెండో రోజు నుంచీ ఖాళీ అయిపోయింది . ఎంత పుష్ చేసి ప్రమోషన్ లు చేసినా ఈ సినిమా పరిస్థితి అంతే అన్నట్టు ఉంది. ఇక మధ్యలో అర్జున్ రెడ్డి కూడా రావడం తో ఈ సినిమా మీద పెద్ద ఆసక్తి చూపలేదు జనాలు  ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీ తనయుడు ఆకాశ్ పూరితో చేస్తున్నట్టుగా చెప్పాడు.


అందుకు సంబంధించిన కాస్టింగ్ కాల్ కూడా వచ్చింది.  అయితే ముందుగా ఏ హీరోతోనైనా ఒక హిట్ కొట్టమనీ, ఆ తరువాత సినిమా ఆకాశ్ తో చేయడం మంచిదని సన్నిహితులు చెబుతున్నారట. లేదంటే ఆకాశ్ ఫస్టు మూవీపై ఆ ప్రభావం పడొచ్చునని అంటున్నారట. ఈ ఆలోచన మంచిదే కదా అని అనుకుంటున్నాడు పూరీ.హిట్టు లేకుండా సినిమా తీస్తే తనతో పాటు తన కొడుకు మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది కదా అని అనుకుంటున్నాడు పూరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: