టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో క్రిష్ కూడా ఒకరు. ఈ డైరెక్టర్ టాలీవుడ్ లో ఇప్పటికే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అటు రెగ్యులర్ సినిమాలతో పాటుగా 'గౌతమి పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను తీసి తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు క్రిష్ బాలీవుడ్ పై కన్నేశాడు. గతంలోనే గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే మూవీని కూడా తీశాడు. అయితే ప్రెజెంట్ చేస్తున్న బాలీవుడ్ మూవీపై మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 


బాలీవుడ్ భామ కంగనా రనౌత్ లీడ్ రోల్ లో 'మణికర్ణిక' చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా  కావడంతో అందరి చూపు దీనిపైనే నిలిచింది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ సినిమా అంటే యుద్ధ సన్నివేశాలు గట్టిగానే ఉంటాయి. ఇక వీటిని తెరకెక్కించడానికి క్రిష్ తెగ కృషి చేస్తున్నారు.


స్టంట్ సీన్లు కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్ నిక్ పావెల్ ని తీసుకొచ్చారు. ఆయన ఆథ్వర్యంలో కంగనా రనౌత్ కి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలలో శిక్షణ ఇప్పించారట. అలాగే హైదరబాద్ కు చెందిన కొంతమంది స్టంట్ ఫైటర్లను తీసుకెళ్లి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారట. ఇదంతా పూర్తైన తర్వాతే యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.  


ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలు టాలీవుడ్, బాలీవుడ్ లో చాలానే వచ్చాయి. అయితే ఈ రేంజ్ లో ఖర్చు చేసి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడం గతంలో జరగలేదనే చెప్పాలి. ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. మరి మణికర్ణిక ఎలా ఉంటుందో తెలియాలంటే కాస్తంత వెయిట్ చేయాల్సిందే.   



మరింత సమాచారం తెలుసుకోండి: