మరో రెండు రోజుల్లో రాబోతున్న జై లవ కుశ సినిమా సందడి థియేటర్ల దగ్గర చూస్తూనే ఉన్నాం. ఈ దసరా పండుగను ముందే తెచ్చేలా వస్తున్న తారక్ జై లవ కుశ భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతుంది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ అన్న కళ్యాణ్ రాం నిర్మాతగా అంటే సొంత బ్యానర్ లెక్కే. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్.


ఛాన్స్ దొరికితే అన్ని మాధ్యమాలను తన ప్రచార సాధనాలుగా వాడేస్తున్నాడు. అసలైతే సినిమాలన్ని శుక్రవారం రిలీజ్ అవుతాయి. కాని జై లవ కుశ గురువారం ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అలా ఎందుకు అంటే ఆల్రెడీ రేపటి నుండి స్కూల్స్ హాలీడే ప్రకటించారు. ఇక గురు వారం మొదలు ఆదివారం వరకు హౌజ్ ఫుల్స్ నడిచినా బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిందే.


ఈ నాలుగు రోజుల్లోనే యంగ్ టైగర్ 100 కోట్ల కలక్షన్స్ కు గురి పెట్టాడు. తొలి వారాంతారం లోనే ఈ సినిమా అనుకున్నంత వసూలు చేసి ఇక మిగిలిన రోజుల్లో లాభాల బాట పట్టాలని చూస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లకు అమ్ముడవగా అది వారం లోపే వెనక్కి తెచ్చేయాలని భారీ స్కెచ్ వేశారు. ఇక సినిమాలో తారక్ మూడు పాత్రలతో నట విశ్వరూపం చూపిస్తున్నాడు కాబట్టి కచ్చితంగా అనుకున్నంత వసూళ్లను రాబట్టడం ఖాయమని చెప్పొచ్చు.


ఏది ఎలా ఉన్నా 21న తారక్ విజృంభణ మొదలైతే మళ్లీ వారం తిరగకుండానే మహేష్ స్పైడర్ తో హంగామా మొదలు పెట్టనున్నాడు. మొత్తానికి ఈ దసరా తారక్, మహేష్ ఇద్దరి సినిమాలతో మరింత కలర్ ఫుల్ గా తయారవనుంది. రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం ఇక టాలీవుడ్ కు కొత్త కళ వచ్చేసినట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: