మరో 5 రోజులలో ముగియబోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో పై ఈరియాల్టీ షో నుంచి ఎలిమినేట్‌ అయిన హీరోయిన్‌ దీక్షా పంత్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వీలో సంచలనవ్యాఖ్యలు చేసింది.  ఈ షోలో తాను ఎంతసేపూ  తింటున్న సీన్స్‌ నిద్రపోతున్న సీన్స్‌ ఏడుస్తున్న సీన్స్‌ మాత్రమే చూపించడం తనకు చాలబాధ కలిగించింది అంటూ కామెంట్స్ చేసింది. 

అంతేకాదు ‘బిగ్‌ బాస్‌’ మీద మాత్రమే కాదు షోలో పాల్గొన్న కో పార్టిసిపెంట్స్‌ పైనా ఘాటైనకామెంట్స్ తో విరుచుకుపడింది  దీక్ష. ముఖ్యంగా ధన్‌ రాజ్‌ ను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడ ఈ బ్యూటీ చేసింది. తనకు  ధనరాజ్  'బంతిపూల జానకి' సినిమా ద్వారా పరిచయమనీ ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో  ధన రాజ్ యాటిట్యూడ్‌ తనకు నచ్చేది కాదని అంటూ మరో షాకింగ్ ట్విస్ట్  ఇచ్చింది. 

ఇవన్ని మనసులో పెట్టుకుని ధన్‌రాజ్‌ తన పట్ల బిగ్‌ బాస్ హౌస్‌ లో టార్గెట్ చేసాడని అభిప్రాయపడుతోంది దీక్ష. ఇదే సందర్భం గా అర్చన హరితేజ తదితరుల పైన కూడ ఈమె కామెంట్స్ చేసింది. అంతేకాదు  ‘బిగ్‌ బాస్‌’ హౌస్‌ నుంచి  తానూ ఎలిమినేట్‌ అయిన తర్వాత కూడా తన మీద అర్చన అక్కసు వెళ్ళగక్కుతోందని  అంటూ దీక్ష తన ఆవేదన వ్యక్తం చేసింది.

 హీరోయిన్ గా ఏమాత్రం విజయాలు సాధించని దీక్షను ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షోలోకి దీక్షను  వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ  అయిన తరువాత ఆమె ప్రవర్తన పై  సెటైర్లు పడటం సర్వసాధారణంగా మారింది. ఏది ఏమైనా చివరి నిముషంలో ఈ షో నుండి ఎలిమినేట్ అయిన దీక్ష చెబుతున్న మాటలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: