నందమూరి అభిమానులలో బాలకృష్ణ జూనియర్ అనే భేదాలు లేకుండా అభిమానులు అంతా ఏకంగా ఉంటే నందమూరి హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ పరంగా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న కామెంట్స్. దీనికి బలం చేకూరుస్తు కొంతమంది నందమూరి వీరాభిమానులు బాలకృష్ణ ‘జై ల కుశ’ సినిమాను ఇప్పటికే చూసాడు అంటూ ఒక ప్రచారానికి తెర తీసాడు.

ఇప్పటికే ఈవిషయం సంచలనం కావడంతో ఎట్టకేలకు జూనియర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ‘జై లవ కుశ’ కు బాలయ్యకు సంబంధం లేదని ప్రకటించాడు. ‘బాబాయ్ మా సినిమా చూడలేదు, నిజానికి జై లవకుశ సినిమాను నేనే ఇప్పటివరకు చూడలేదు, రిలీజ్ కు ముందు సినిమా చూడాలంటే నాకు చాలా టెన్షన్, బిట్స్ బిట్స్ గా సినిమా చూశాను కానీ టోటల్ మూవీ అంతా చూడలేదు, రిలీజ్ అయిన తర్వాతే చూస్తాను, కల్యాణ్ రామ్ మాత్రం సినిమా మొత్తం చూశాడు. బాలకృష్ణ గారు మా సినిమా చూశారనే వార్తలో మాత్రం నిజంలేదు. బహుశా థియేటర్లలోకి వచ్చిన తర్వాత చూస్తారేమో’ అంటూ ఒక వ్యూహాత్మక ఫీలర్ వదిలి జూనియర్ తాను తన బాబాయ్ ఒకటే అన్న సంకేతాలు ఇస్తున్నాడు. 

ఇది ఇలా ఉండగా ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే ఈసినిమా పై  విదేశాల్లో ఇండియన్ సినిమాల క్రిటిక్‌గా సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధూ ఇచ్చిన రివ్యూ కొంత వరకు జూనియర్ అభిమానులను అదేవిధంగా ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లను భయపెడుతోంది. ఈ సినిమాలో కొన్ని చోట్ల సీన్లు చాలా లాగారని ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేస్తే బావుండేదని ఉమైర్ సంధు కామెంట్ చేస్తున్నాడు. 

అంతేకాదు ఈసినిమా స్టోరీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయంటూ రాసుకొచ్చిన ఉమైర్ సంధు ఓవరాల్ గా ‘జై లవ కుశ' చిత్రం జూనియర్ అభిమానులకు బాగా నచ్చే సినిమాగా మారుతుంది అని కామెంట్స్ చేస్తున్న నేపధ్యం హాట్ టాపిక్ గా మారింది. దీనితో ‘జై లవ కుశ’ కేవలం జూనియర్ అభిమానులను మెప్పించే సినిమాగా మాత్రమే మారిపోతుందా అంటూ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: