ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున న‌టించిన చిత్రం ‘రాజుగారి గ‌ది 2’ ట్రైలర్ ను ఈరోజు విడుదల చేస్తూ నాగార్జున ఓంకార్ పై వేసిన సెటైర్లు అందరి కీ షాక్  ఇచ్చాయి. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు జయతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమమంలో నాగార్జున మాట్లుడుతూ ‘షూటింగ్ అంతా స‌ర‌దాగా సాగింది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అని ఉండేది అప్పుడ‌ప్పుడూ ఓంకార్ న‌న్ను ఏడిపించాడు అది మిన‌హాయిస్తే అంతా స‌వ్యంగా సాగింది. నేనేం ఓంకార్‌మీద కంప్లైంట్ చేయ‌డం లేదు ఎవ‌రేం చేసినా సినిమా బాగా రావ‌డం కోస‌మే’ అన్నాడు నాగ్‌.  

దీనితో ఈ కార్యక్రమానికి  వచ్చిన కొందరు ఈ సినిమా లోని కొన్ని సీన్స్ నాగార్జునకు నచ్చలేదు అని వచ్చిన  వార్తలకు  నాగ్ చేసిన కామెంట్స్ బలాన్ని చేకురుస్తున్నాయి అన్న కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. ఇదే సందర్భంలో నాగార్జున మాట్లుడుతూ  కేర‌ళ‌లోని ఓ వ్య‌క్తికి ఎదుటివాళ్ల మ‌న‌సులో ఏముందో ప‌సిగ‌ట్టే శ‌క్తి ఉంద‌ని అత‌న్ని స్ఫూర్తిగా చేసుకొనే త‌న పాత్ర‌ని డిజైన్  చేసినట్లు తెలియచేసాడు.  

అంతేకాదు  ఆ వ్య‌క్తిని కూడా నాగ్ క‌లిశాడ‌ట‌. ‘మీ మ‌న‌సులో నాలుగు ప‌దాలు అనుకోండి అవేంటో చెబుతా’ అని నాగార్జునకే ప‌రీక్షపెట్టిన విషయాన్ని బయట పెడుతూ   తానూ మనసులో అనుకున్న నాలుగు పదాలను ఆవ్యక్తి    చ‌టుక్కున చెప్పేయ‌డం తనకు షాక్  ఇచ్చింది అని అంటున్నాడు. ఇది ఇలా ఉండగా బీచ్ సైడ్ ఉండే ఒక ఇంటిని పట్టి వేధిస్తున్న దెయ్యం పాత్రలో సమంత ఈ ట్రైలర్ కనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో సీరత్ కపూర్ మాత్రం భారీగా అందాలను ఆరబోసినట్లు అనిపిస్తోంది. 

ఒక షాట్లో ఆమెను వెనుక నుండి బికినీలో చూపించేసి ఓంకార్ మార్కులు వేయించుకున్నాడు అని అనిపిస్తుంది. అయితే ఈసినిమా కథ రొటీన్ కథలా అనిపిస్తున్న నేపధ్యంలో ఎంతవరకు ఈసినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది అన్న విషయం తెలియాలి అంటే  అక్టోబర్ 13 వరకు ఆగాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: