నిన్న అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘జై లవ కుశ’ సినిమా జూనియర్ నటనా సామర్ధ్యానికి ప్రతీకగా మారిపోవడంతో ఈసినిమా పై ప్రస్తుతం ఎక్కడా నెగిటివ్ టాక్ వినిపించడం లేదు. అయితే ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ కి చేరుకుంటుందా లేదా అనే విషయాల పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈసినిమా సక్సస్ స్థాయి వచ్చే వారం విడుదల కాబోతున్న ‘స్పైడర్’ రిజల్ట్ వచ్చిన తరువాత మాత్రమే స్పష్టంగా తెలుస్తోంది అని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థుతులలో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ జూనియర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వెనుక అర్ధాలు ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. 
 జూనియర్ ఈ ఇంటర్వ్యూలో తాను ‘వారసత్వాన్ని నమ్మను’ అన్న కామెంట్స్‌ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పైనే ఇన్నర్‌గా నందమూరి ఫాన్స్‌లో అలజడి రేగుతోంది. ఇటువంటి కామెంట్స్ నాని నిఖిల్ రాజ్ తరుణ్ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది కాని జూనియర్ ఎందుకు ఇలా మాట్లాడాడు అన్న కోణంలో జూనియర్ అభిమానులే షాక్ అవుతున్నట్లు టాక్. తారక్ విషయంలో అతడి కెరియర్ మొదటినుండి సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఫాన్స్ మద్దతుగా ఉన్నారు. 

కొన్నేళ్ల వరకు తన ప్రతి సినిమా వేడుకల్లోనూ బాబాయ్ బాలయ్య పేరును ప్రస్తావించే తారక్ ఇప్పుడు పూర్తిగా మరచాడని ఇప్పటికే బాలకృష్ణ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. దీనికితోడు ఇప్పుడు ‘వారసత్వాన్ని నమ్మను’ అంటూ జూనియర్ బహిరంగంగా చేస్తున్న కామెంట్స్ వల్ల నందమూరి అభిమానులకు దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుందని జూనియర్ అభిమానులే భయపడుతున్నట్లు టాక్. 

ఏ స్టార్ కైనా ఒక స్థాయికి చేరాక వారసత్వం గురించి ప్రస్తావన అవసరం లేదు అన్న ఫీలింగ్ తో జూనియర్ చేసిన కామెంట్స్ వాస్తవమే అయినా కంటెంట్ పరంగా పెద్దగా గొప్పగా లేని ‘జై లవ కుశ’ ను నందమూరి అభిమానులు పట్టించుకోకుండా కేవలం జూనియర్ అభిమానులు మాత్రమే చూస్తే ‘జై లవ కుశ’ ఏ విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న భావనలో జూనియర్ అభిమానులు ఉన్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ‘జై లవ కుశ’ టాక్ గురించి తెలుగుదేశ అధినాయకత్వం కూడ ఆ శక్తి కనపరిచింది అని వార్తలు రావడం బట్టి ఈసినిమా పై వారసత్వం పై ఎంత ప్రభావితం చేస్తోందో అర్ధం అవుతోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: