యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై ల‌వ‌కుశ గురువారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎన్న‌డూ లేని విధంగా తొలి రోజు 2400 స్క్రీన్ల‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే భీక‌ర ఫామ్‌తో ఉండ‌డంతో పాటు భారీగా రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజు మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి.

jai lava kusa images కోసం చిత్ర ఫలితం

ఓవ‌ర్సీస్‌లో కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసేసిన జై ల‌వ‌కుశ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. కొన్ని ఏరియాల్లో ఎన్టీఆర్‌ గత సినిమాల ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌ రికార్డుల్ని ఈ చిత్రం అధిగమించేసింది. ఇక టాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ల‌కు కీల‌క‌మైన నైజాం ఏరియాలో ఈ సినిమా 5.05 కోట్ల షేర్ రాబట్టింది.


ఇక నంద‌మూరి ఫ్యామిలీ హీరోల సినిమాల‌కు కంచుకోట అయిన సీడెడ్‌లో 3.77 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మొదటిరోజు షేర్ రూ.20 కోట్ల పైనే ఉంటుందని ప్రాథ‌మిక అంచ‌నా. ఇక కోస్తాలోని గుంటూరు, కృష్ణా, వెస్ట్‌, ఈస్ట్‌ల‌లో సైతం ఈ సినిమాకు అదిరిపోయే క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఏరియా వైజ్‌గా వ‌సూళ్ల పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది. 


ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ హిట్టా..ఫట్టా..!

ఇక జై ల‌వ‌కుశ థియేట్రిక‌ల్ రైట్స్‌ను రూ.86 కోట్ల‌గా విక్రయించ‌గా, ఈ సినిమాకు టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ రూ.112 కోట్లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ లెక్క‌న ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి రావాలంటే రూ.90 కోట్ల షేర్ రూ.150 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: