తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు. టెంపర్ చిత్రంలో మొదట నెగిటీవ్ షేడ్స్ లో నటించిన ఎన్టీఆర్ నిన్న రిలీజ్ అయిన ‘జై లవ కుశ’ చిత్రంలో పూర్తి స్థాయిలో నెగిటీవ్ పాత్రలో నటించి మెప్పించారు.
ఈ చిత్రంపై పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఎన్టీఆర్ నటన మెచ్చుకుంటూ ప్రశంసించారు. ఎస్ ఎస్ రాజమౌళి అయితే...జై పాత్ర తన గుండెలు పిండేసిందని అన్నారు. ఇదే క్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ‘నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవకుశ లో తారక్ నటన అమోఘం. ‘జై’ ఒక అద్భుతం.
ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. జై పాత్రలో ఎన్టీఆర్ ను తప్ప ఎవరినీ ఊహించుకోలేమని యువ దర్శకుడు గోపిచంద్ మలినేని పేర్కొన్నారు. ‘తారక్ దున్నేశాడు.. శుభాకాంక్షలు’ అని ఆయన అన్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన జై లవ కుశ చిత్రం ఎన్టీఆర్ యాక్షన్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే బాక్సాఫీసు వద్ద ‘జై లవకుశ’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ. 15 నుంచి 20 కోట్ల మధ్య వసూలు చేసినట్లు సమాచారం.