ప్రపంచ వ్యాప్తంగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను గత రెండు నెలలు పైగా అలరిస్తున్న ‘బిగ్ బాస్’ బాస్ షో చివరి ఘట్టానికి చేరుకుంది. రేపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన మాటల మాయాజాలంతో తనదైన శైలిలో తెలుగు బిగ్ బాస్ ను రక్తికట్టించిన విషయం తెలిసిందే. రేపటి ఆదివారంతో ‘బిగ్ బాస్’ సీజన్ 1 ముగింపుకు రాబోతోంది. 

దీనితో ‘బిగ్ బాస్’ ఫైనల్ ఎపిసోడ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా స్టార్ మా యాజిమాన్యం ప్లాన్ చేస్తోంది. రేపు ప్రసారంకాబోయే ఈ ఫైనల్ ఎపిసోడ్ ఏకధాటిగా నాలుగు గంటలపాటు ప్రసారం కాబోతోంది అని తెలుస్తోంది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాగార్జున – దేవీశ్రీప్రసాద్ లు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ తో మంచి సన్నిహిత సంబంధాలు కలిగిన నాగార్జున దేవీశ్రీప్రసాద్ లు ఈషోకు అతిధులుగా రావడం వెనుక జూనియర్ వ్యూహాలు బాగా పనిచేసాయి అని అంటున్నారు. వాస్తవానికి మహేష్ ను ఈ ఫైనల్ ఎపిసోడ్ కు అతిధిగా పిలిచినా మహేష్ రాణి లోటును నాగార్జున దేవీశ్రీప్రసాద్ లు తీరుస్తున్నారు అనుకోవాలి. 

ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ లో ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులందరూ సందడి చేయబోతున్నారు. వారందరి డాన్స్ లతో జోక్స్ తో ఈ ఫైనల్ ఎపిసోడ్ హోరెత్తబోతోంది. ‘జై లవ కుశ’ ఇచ్చిన సక్సస్ కిక్ తో ఉన్న జూనియర్ రేపు బుల్లితెర పై మరొకసారి తన విశ్వరూపాన్ని చూపెట్టబోతున్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: