బాలయ్యతో దర్శకుడు పూరిజగన్నాథ్ తీసిన 'పైసా వసూల్' ఘోర పరాజయం చెందినా పూరి తన పట్టుదల విడవకుండా తన తర్వాత సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. తన కొడుకు ఆకాష్ హీరోగా తీయబోతున్న ప్రేమకథ చిత్రం కోసం ఏర్పాట్లను వేగవంతం చేసాడు.
ఈ నేపధ్యంలో ఆకాష్ సరసన హీరోయిన్ ఎంపికకుసంబంధించి ఏకంగా పూరి 200 మంది కొత్త అమ్మాయిలను ఆడిషన్ చేయడం ఇప్పడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సుమారు 200 మంది అమ్మాయిలకి ఆడిషన్స్ నిర్వహించిన తరువాత పూరి ఫైనల్గా ఒక అమ్మాయికి ఓటు వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు 'నేహా శెట్టి' అని తెలుస్తోంది.
ఈ బ్యూటీ పై పూరి ఫోటో షూట్ ట్రయల్ షూట్ కూడా నిర్వహించి తన సినిమాకు సూటవ్వడంతో పాటు ఆకాష్ కు కూడ సరిజోడిగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు నేహా శెట్టి కర్నాటకు చెందిన అమ్మాయి.
కన్నడలో ఇప్పటికే 'ముంగారు మలే 2' అనే సినిమాలో నటించింది. అంతేకాకుండా ఈమె మంగుళూరు అందాలపోటీల్లో నెగ్గి ‘మిస్ మంగుళూరు’ అనే టైటిల్ విన్నర్ గా ఎంపిక అయింది. పూరి స్టైల్ లవ్ స్టోరీస్ చాలా డిఫెరెంట్ గా ఉండే నేపధ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పూరి చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆకాష్ 2015లో హీరోగా చేసిన ‘ఆంధ్ర పోరి' సినమా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆకాష్ ఈ గ్యాప్ లో నటనతో పాటు డాన్స్, యాక్షన్, హార్స్ రైడింగ్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరస పరాజయాలతో సతమత మవుతున్న పూరి ఇప్పటి తరం ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా ఈసినిమాను తీసి ఏ విధంగా ఆకాష్ ను సెటిల్ చేస్తాడో చూడాలి..